logo

డీడీవో, సచివాలయ సిబ్బందికి షోకాజ్‌ నోటీసు

మండలంలోని బాలేరు గ్రామ సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి(డీడీవో) గణతంత్ర దినోత్సవం రోజున పూర్తిగా సచివాలయం మూసివేసినందుకుగాను....

Published : 27 Jan 2022 06:12 IST

భామిని, న్యూస్‌టుడే: మండలంలోని బాలేరు గ్రామ సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి(డీడీవో) గణతంత్ర దినోత్సవం రోజున పూర్తిగా సచివాలయం మూసివేసినందుకుగాను విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారనే అభియోగంపై వివరణ కోరుతూ స్థానిక ఎంపీడీవో పైడితల్లి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై స్థానికులు వాట్సప్‌ ద్వారా ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఆమె సచివాలయ సిబ్బంది ఎందుకు గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించలేదో మండల పరిషత్తు కార్యాలయానికి వచ్చి రాతపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు సచివాలయ సిబ్బంది, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసు జారీ చేయవలసిందిగా కలెక్టర్‌ ఆదేశించినట్లు నోటీసులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని