అనాసకు మద్దతు లభించేనా..!
సీతంపేట మన్యంలో కొద్ది నెలల్లో అనాస (పైనాపిల్) సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడక్కడా కాసిన పండ్లు కొద్దికొద్దిగా మార్కెట్లు, వారపు సంతలకు వస్తున్నాయి.
సీతంపేట, న్యూస్టుడే: సీతంపేట మన్యంలో కొద్ది నెలల్లో అనాస (పైనాపిల్) సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడక్కడా కాసిన పండ్లు కొద్దికొద్దిగా మార్కెట్లు, వారపు సంతలకు వస్తున్నాయి. గిరిజనులు పోడు వ్యవసాయంలో జీడి తోటలు, ఇతర తోటల్లో అనాసను అంతరపంటగా పండిస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సుమారు ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. లెక్కల్లోకి రానిది మరికొంత ఉంటుంది. సుమారుగా 50 వేల టన్నుల పంట దిగుబడి వస్తుందని చెబుతున్నా అంతకంటే ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. అధికారులు చొరవ తీసుకొని అనాస ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే మెరుగైన ఆదాయం వస్తుందని గిరిజనులు అభిప్రాయపడుతున్నారు.
గిరాకీ అధికం.. సీతంపేట మన్యంలో 90 శాతం, భామిని, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, బూర్జ, పాతపట్నం, హిరమండలం, మందస, మెళియాపుట్టి తదితర గిరిజన మండలాల్లోనూ సాగుకు చర్యలు చేపడుతున్నారు. సేంద్రియ పద్ధతిలో పండటంతో మన్యం అనాసకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఇక్కడి నుంచి మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్తుంది. సింహాచలం రకం అధికంగా సాగు చేస్తుండగా గిరిజనులకు మేలు కలిగించే క్యూ రకాన్ని కొన్నేళ్ల క్రితం అధికారులు ఆ ప్రాంతానికి పరిచయం చేశారు.
సీతంపేట సంతలో విక్రయానికి తీసుకొచ్చిన అనాస
ప్రోసెసింగ్ యూనిట్లు నెలకొల్పితేనే.. మార్చి, ఏప్రిల్ నుంచి మన్యం అనాస భారీగా మార్కెట్కు రానుంది. వర్షాకాలం వరకు పంట ఉంటుంది. ఈలోగా ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుంది. ఏటా పంట భారీగా సంతలకు వచ్చే సమయంలో ధర పతనమై గిరిజనులు నష్టపోతున్నారు. కొన్నిసార్లు ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేసి తరలించే ఏర్పాట్లు చేస్తున్నా, అవి తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తున్నాయని చెబుతున్నారు. ప్రోసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే జ్యూస్, జామ్ వంటివి తయారుచేసేందుకు వీలు కలిగి పంటకు గిట్టుబాటు ధర వస్తుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని గిరిబిడ్డలు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం.. సీతంపేటలో రూ.5 కోట్లతో అనాస ప్రోసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు ఐటీడీఏ పీవో ద్వారా కలెక్టరుకు ప్రతిపాదనలు పంపాం. భూసేకరణ, అగ్రిమెంట్లు వంటివి జరుపుతున్నాం. సీతంపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేశాం. యూనిట్ మంజూరైతే ట్రైఫెడ్ నుంచి నిధులు, విశాఖపట్టణానికి చెందిన డాన్ ఫౌండేషన్ వారి ద్వారా ఇంప్లిమెంటేషన్ జరగనుంది. మన్యంలో ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే గిరిజనులకు మేలు జరుగుతుంది.
- బి.నారాయణరావు, ఏపీడీ, వైఎస్సార్ క్రాంతి పథం, టి.భవానీశంకర్, ఇన్ఛార్జి పీహెచ్వో, సీతంపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?