పోరాటాలు వృథా కారాదు
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం కలెక్టర్ లఠ్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు వహించాలన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు జిల్లాలో 37 ఆసుపత్రులను నోటిఫై చేశామని, 353 ఐసీీయూ, 1641 ఆక్సిజన్, 628 సాధారణ పడకలు సిద్ధం చేశామని వివరించారు.
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్, సాంస్కృతికం, అరసవల్లి
అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ పేర్కొన్నారు. ఎందరో నాయకుల పోరాటాలకు దక్కిన ఫలితాన్ని వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం కలెక్టర్ లఠ్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు వహించాలన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు జిల్లాలో 37 ఆసుపత్రులను నోటిఫై చేశామని, 353 ఐసీీయూ, 1641 ఆక్సిజన్, 628 సాధారణ పడకలు సిద్ధం చేశామని వివరించారు.
గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్ శ్రీకేష్ బి. లఠ్కర్, చిత్రంలో ఎస్పీ అమిత్ బర్దార్
కొనుగోళ్లు వేగవంతం చేస్తాం..
7.8 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పెట్టుకు న్నామని, దాన్ని సాధించేందుకు ప్రక్రియ వేగవంతం చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు పాడి ఆవులు, మేకలు, గొర్రెల పెంపకం, అపరాల పంటలు వేయడం వంటి అంశాలపైనా దృష్టి సారించి ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. జిల్లాలో 700 పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు అమూల్ సంస్థతో ఒప్పందం జరిగిందన్నారు.
టెక్కలిలో జెండాకు వందనం చేస్తున్న సబ్ కలెక్టర్ వికాస్ మర్మత్
ఆగస్టు నాటికి ఉద్దానం పథకం
ఉద్దానం మండలాల్లోని 807 గ్రామాలకు రూ.700 కోట్లతో చేపట్టిన ఉద్దానం తాగునీటి పథకం ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, జల్జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయడానికి రూ.95.98 కోట్లతో పనులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. వంశధార, ఆఫ్షోర్, తోటపల్లి, నారాయణపురం ప్రాజెక్టులు, వంశధార-నాగావళి అనుసంధాన కాలువ తదితర పనులను వీలైనంత వేగంగా పూర్తిచేయడానికి కార్యాచరణ రూపొందించామన్నారు. ● పేదలందరికీ ఇళ్ల పథకం కింద 91,660 ఇళ్లు మంజూరు కాగా 62,173 నిర్మాణం ప్రారంభమైందన్నారు. 3,398 నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు.
ఆకట్టుకున్న విద్యార్థినుల గిరిజన నృత్యం
ముందుకు రావాలి
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు పలు అవకాశాలున్నాయని, ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు. 2021-22 సంవత్సరంలో 147 చిన్న తరహా పరిశ్రమలు రూ.83.08 కోట్లతో ఏర్పాటై 1,317 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాయన్నారు. ● మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని, కొమ్మనాపల్లి వంతెనను ఇటీవల ప్రారంభించుకున్నామని, కొత్తగా 9 పీీహెచ్సీీలు ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. ● జిల్లాలో కేవలం 12.12 శాతం మాత్రమే అడవులున్నాయని వీటి పెంపునకు యువత భాగస్వామ్యం కావాలన్నారు. ఎసీ్పీ అమిత్ బర్దార్, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ, జేసీలు విజయసునీత, శ్రీనివాసులు, శ్రీరాములునాయుడు, మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఛైర్ పర్సన్ హేమామాలిని, టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మత్ పాల్గొన్నారు.
భారత మాతకు జేజేలంటూ బాలికల నృత్య రూపకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు