ఆరుతడి వైపు.. రైతుల చూపు
ఈ ఏడాది రబీ సాగుపై అధికారులు చూపించిన చొరవ రైతులకు ఫలితం ఇవ్వనుంది. ఈ రబీలో మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతులంతా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు.
మడ్డువలస ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న సాగునీరు
సంతకవిటి, న్యూస్టుడే: ఈ ఏడాది రబీ సాగుపై అధికారులు చూపించిన చొరవ రైతులకు ఫలితం ఇవ్వనుంది. ఈ రబీలో మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతులంతా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. అధికారుల చైతన్య కార్యక్రమాలు, ప్రాజెక్టు ద్వారా విడతల వారీగా సాగునీరు అందిస్తుండటమే దీనికి కారణం. దీంతో మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, రాగులు, ఇతర అపరాలు సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు.
మడ్డువలస ప్రాజెక్టును 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేశారు. నాటినుంచి వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల్లోని 24,700 ఎకరాలకు ఖరీఫ్కే సాగునీరు అందేది. ప్రాజెక్టులో నీటినిల్వ తక్కువ ఉందని, కాలువలు మరమ్మతు చేయాలనే కారణాలు చూపించి రబీలో విడుదల చేసేవారు కాదు. ఈసారి రబీ పూర్తయ్యే వరకు కాలువలకు మరమ్మతులు చేయరాదని కలెక్టరు ముందుగానే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులో 65 మీటర్ల మేర నీటినిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎకరాలో అపరాలు పండిస్తే 2-3 బస్తాలు మాత్రమే దిగుబడి, రూ.10 వేలలోపే ఆదాయం వస్తుంది. అదే ఎకరాలో మొక్కజొన్న వేస్తే రూ.45 వేల వరకు వచ్చే అవకాశం ఉందని అన్నదాతలు చెబుతున్నారు.
పుష్కలంగా భూగర్భజలాలు..
మడ్డువలస కాలువల్లో సాగునీరు వస్తుండటంతో రైతులు పంటలకు ఆరుతడులు అందించి మిగిలిన నీటిని చెరువుల్లో నిల్వ ఉంచుతున్నారు. దీంతో చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. మరోవైపు భూగర్భజలాలు పది అడుగుల లోపే ఉంటున్నాయి. వేసవిలో పశువులకు తాగునీటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
పంట ఏపుగా పెరిగింది...
గతంలో వరిపంట తరువాత మొట్ట భూములన్నీ వృథాగా విడిచి పెట్టేవాళ్లం. ప్రస్తుతం కాలువలు ద్వారా సాగునీరు ఇస్తుండటం, అధికారుల ప్రోత్సాహంతో మొక్కజొన్న వేస్తున్నాం. ప్రస్తుతం పంట ఏపుగా పెరిగింది. అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. - పి.గోవిందరావు, రైతు
ఏప్రిల్ వరకూ నీరందిస్తాం...
రబీలో ఆరుతడి పంటలకు సాగునీరు అందిస్తున్నాం. గతంలో నిరుపయోగంగా ఉన్న భూములు నేడు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఏప్రిల్ రెండోవారం వరకూ సాగునీటిని దఫదఫాలుగా అందించాలని నిర్ణయించాం. అంతేగాకుండా వచ్చే ఖరీఫ్నకు జూన్ నెలలోనే సాగునీరు అందించాలని లక్ష్యంతో ఉన్నాం.
- నర్మదాపట్నాయక్, డీఈఈ, మడ్డువలస ప్రాజెక్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ