logo

గాయపడిన వ్యక్తి మృతి

మండలంలోని దిమ్మిడిజోల గ్రామానికి చెందిన పల్లి కృష్ణారావు(42) ఈనెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ మహమ్మద్‌యాసిన్‌ పేర్కొన్నారు.

Published : 27 Jan 2022 06:20 IST


పల్లి కృష్ణారావు (దాచిన చిత్రం)

ద్మిడిజోల(నందిగాం), న్యూస్‌టుడే: మండలంలోని దిమ్మిడిజోల గ్రామానికి చెందిన పల్లి కృష్ణారావు(42) ఈనెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ మహమ్మద్‌యాసిన్‌ పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కృష్ణారావు ఆదివారం తన పొలంలో వంగనార్లు నాటి ఇంటికొచ్చారు. సాయంత్రం చెప్పులు కొనుక్కొనేందుకు ద్విచక్ర వాహనంపై కల్లాడ వెళ్తూ మార్గమధ్యలో మలుపు వద్ద అదుపుతప్పి పొలంలో పడిపోయారు. బండి హ్యాండిల్‌ కడుపులో గుచ్చుకోవడంతో దాన్ని తీసేసి ఇంటికొచ్చి ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద ప్రథమచికిత్స చేయించుకున్నారు. కుటుంబసభ్యులు ఆ తరువాత ఆయన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నదిలో స్నానానికి వెళ్లి విద్యార్థి...

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని హయాతీనగరం వద్ద నాగావళి నదిలో స్నానానికి ఓ విద్యార్థి బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ప్రయివేట్‌ కళాశాలలో ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనపర్తి రాజు తెలిసివారికి సంబంధించి ఒకరు చనిపోవడంతో చూసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు నాగావళి నది వద్దకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించారు. రాజు తండ్రి వెంకటరమణ పచ్చళ్ల వ్యాపారం చేస్తుంటారు. వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్‌.ఐ. దుర్గాప్రసాద్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని