గాయపడిన వ్యక్తి మృతి
మండలంలోని దిమ్మిడిజోల గ్రామానికి చెందిన పల్లి కృష్ణారావు(42) ఈనెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ మహమ్మద్యాసిన్ పేర్కొన్నారు.
ద్మిడిజోల(నందిగాం), న్యూస్టుడే: మండలంలోని దిమ్మిడిజోల గ్రామానికి చెందిన పల్లి కృష్ణారావు(42) ఈనెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ మహమ్మద్యాసిన్ పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కృష్ణారావు ఆదివారం తన పొలంలో వంగనార్లు నాటి ఇంటికొచ్చారు. సాయంత్రం చెప్పులు కొనుక్కొనేందుకు ద్విచక్ర వాహనంపై కల్లాడ వెళ్తూ మార్గమధ్యలో మలుపు వద్ద అదుపుతప్పి పొలంలో పడిపోయారు. బండి హ్యాండిల్ కడుపులో గుచ్చుకోవడంతో దాన్ని తీసేసి ఇంటికొచ్చి ఆర్ఎంపీ వైద్యుడి వద్ద ప్రథమచికిత్స చేయించుకున్నారు. కుటుంబసభ్యులు ఆ తరువాత ఆయన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నదిలో స్నానానికి వెళ్లి విద్యార్థి...
శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: శ్రీకాకుళం నగరంలోని హయాతీనగరం వద్ద నాగావళి నదిలో స్నానానికి ఓ విద్యార్థి బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ప్రయివేట్ కళాశాలలో ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనపర్తి రాజు తెలిసివారికి సంబంధించి ఒకరు చనిపోవడంతో చూసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు నాగావళి నది వద్దకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించారు. రాజు తండ్రి వెంకటరమణ పచ్చళ్ల వ్యాపారం చేస్తుంటారు. వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్.ఐ. దుర్గాప్రసాద్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటల మామ.. సంక్షేమం మమ..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని పిల్లలందరికీ తనకు తాను మేనమామగా ప్రకటించుకున్న సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను ఎంతో ఉద్ధరించినట్లు గొప్పలు చెబుతారు. -
ఉసురు తీసిన అక్రమ తవ్వకాలు
[ 20-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఇసుక పెళ్లలు పడి ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. -
రెండో రోజు.. ప్రధాన పార్టీల జోరు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వంలో రెండో రోజు సందడిగా సాగింది. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థులు బోణీ చేయగా.. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
నామినేషన్ల కోలాహలం
[ 20-04-2024]
ప్రధాన పార్టీల అభ్యర్థులు శుక్రవారం టెక్కలి, పాతపట్నంలో నామినేషన్లు వేశారు. పాతపట్నంలో కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమానికి కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 20-04-2024]
బాలికలు, మహిళలు సొంత కాళ్లపై నిల్చొని ఉపాధి పొందేందుకు తగిన సహకారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం దశాబ్దాల క్రితం శిక్షణ కేంద్రాలను జిల్లాకు ఓ చోట ఏర్పాటు చేసింది. -
పర్యాటక కేంద్రంగా భావనపాడు: అచ్చెన్న
[ 20-04-2024]
రానున్న రోజుల్లో సంతబొమ్మాళి మండలం భావనపాడును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 20-04-2024]
లావేరు మండలం పెద్దలింగాలవలస సర్పంచి ప్రతినిధి, లుకలాపు అప్పలనాయుడు, ఇతర నేతలు శుక్రవారం భాజపాలో చేరారు. -
వైకాపాకు డోల జగన్ రాజీనామా
[ 20-04-2024]
రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ సఫలం కాలేకపోయిందని డీసీసీబీ మాజీ ఛైర్మన్ డోల జగన్ ఆరోపించారు. -
ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మహిళ మృత్యువాత
[ 20-04-2024]
మండలంలోని పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజినీ (48) ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
నిరాడంబరంగా గౌతు శిరీష నామినేషన్
[ 20-04-2024]
పలాస నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ రెండోరోజు కూటమి అభ్యర్థి గౌతు శిరీష నిరాడంబరంగా వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్ బాబు ర్యాలీగా వచ్చి దాఖలు చేశారు. -
పట్టణంలోనే ఉన్నా.. నిత్యం నరకమే
[ 20-04-2024]
కాలువలు ఉండవు, మట్టి రోడ్లే గతి, విద్యుత్తు దీపాలు కనిపించవు, తాగునీరు సేకరణకు అవస్థలు తప్పవు ఇదీ ఎస్టీ రిజర్వేషన్ పొందిన 4వ వార్డు దుస్థితి. వాస్తవంగా పురపాలకసంఘ బడ్జెట్లోనూ ఎస్సీ, ఎస్టీ వార్డులకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు