logo

భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్‌

భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.

Published : 29 Jan 2022 05:24 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, చిత్రంలో జేసీ విజయసునీత

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసేకరణకు నిధుల సమస్య లేనందున పనులు వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూ సేకరణలో తహసీల్దార్ల సహకారం తీసుకోవాలని, రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను భూసేకరణ ఉప కలెక్టర్లు వివరించారు. ఇరిగేషన్‌ పనులను వేగవంతం చేయాలని వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావును ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ ఎం.విజయసునీత, భూసేకరణ, ప్రత్యేక ఉప కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని