చిత్ర వార్తలు
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేశారని కృతజ్ఞతలు తెలుపుతూ వైకాపా నాయకులు జిల్లావ్యాప్తంగా శుక్రవారం సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు.
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేశారని కృతజ్ఞతలు తెలుపుతూ వైకాపా నాయకులు జిల్లావ్యాప్తంగా శుక్రవారం సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. కంచిలిలో జరిగిన ర్యాలీలో జడ్పీ ఛైర్పర్సన్ పిరియా విజయ తదితరులను చిత్రంలో చూడొచ్చు.
- న్యూస్టుడే, బృందం
కల్యాణం... కమనీయం
పుష్య బహుళ ఏకాదశి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణస్వామి కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అనివెట్టి మండపంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఉషాపద్మీనీచ్ఛాయ సమేత సూర్యనారాయణస్వామి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో భక్తులను అనుమతించలేదని ఆలయ ఈవో సూర్యప్రకాశ్ తెలిపారు.
- న్యూస్టుడే, అరసవల్లి
దారికిరాని పనులు
నాగావళి నదిపై రూ.39 కోట్లతో సంతకవిటి-బూర్జ మండలాల మధ్య నిర్మించిన వంతెన ఇది. 2013లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అదే ఏడాది పనులు ప్రారంభమయ్యాయి. 2018లో పూర్తయినా ఇరువైపులా అనుబంధ రహదారుల నిర్మాణం చేపట్టలేదు. దీంతో రాకపోకలకు ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనుబంధ రహదారుల పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ర.భ.శాఖ ఈఈ రవినాయక్ తెలిపారు.
- న్యూస్టుడే, సంతకవిటి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా