logo

సిగలపుట్టుగలో వృద్ధుడి హత్య

మందస మండలం భేతాళపురం పంచాయతీ సిగలపుట్టుగకు చెందిన బైపల్లి పకీరు(69) హత్యకు గురయ్యాడు. గ్రామస్థులతో పాటు పకీరు మేనల్లుడు చీకటి భుజంగరావు శుక్రవారం ....

Published : 29 Jan 2022 05:24 IST


పకీరు (దాచినచిత్రం)

మందస, న్యూస్‌టుడే: మందస మండలం భేతాళపురం పంచాయతీ సిగలపుట్టుగకు చెందిన బైపల్లి పకీరు(69) హత్యకు గురయ్యాడు. గ్రామస్థులతో పాటు పకీరు మేనల్లుడు చీకటి భుజంగరావు శుక్రవారం ఇచ్చిన సమాచారం మేరకు సోంపేట సీఐ రవిప్రసాద్‌, మందస ఎస్‌ఐ వెంకటేశ్‌ సంఘటనస్థలాన్ని పరిశీలించారు. తలపై బలమైన గాయాలుండడంతో హత్యకు గురైనట్టు గుర్తించారు. శ్రీకాకుళం నుంచి జాగిలాలను రప్పించి దర్యాప్తు నిర్వహించారు. పకీరు భార్య అనారోగ్యంతో గతంలో మృతిచెందింది. దీంతో రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కుటుంబ సభ్యులు నిరాకరించడంతో తరచూ తగాదాలు జరిగేవి. శుక్రవారం వివాహం జరగాల్సి ఉండగా ఉదయానికే విగతజీవిగా మారాడు. హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని