అవసరం 104.. ఉన్నది 34
జిల్లాలోని గ్రంథాలయాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. కేంద్రగ్రంథాలయంతో పాటు వివిధ మండలాల్లో మొత్తం 44 శాఖాగ్రంథాలయాలున్నాయి. వాటిల్లో 104 మంది శాశ్వత ఉద్యోగులు అవసరంకాగా...
గ్రంథాలయాలను వేధిస్తున్న సిబ్బంది కొరత
ఇది శ్రీకాకుళంలోని కేంద్ర గ్రంథాలయం. ఇక్కడకు నిత్యం సుమారు 500-600 మంది పాఠకులు వస్తుంటారు. ఉన్న అరకొర సిబ్బందితో ఏళ్లుగా దీన్ని నిర్వహిస్తున్నారు. గేడ్- 2 గ్రంథాలయాధికారి, రికార్డు అసిస్టెంట్, మూడు అటెండర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం కాపలాదారూ లేకపోవడం శోచనీయం.
శ్రీకూర్మం శాఖా గ్రంథాలయాధికారి మూడేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి ఇన్ఛార్జి పాలనలోనే కొనసాగుతోంది. ఆయన వారానికోమారు వచ్చి వెళ్తుంటారు. నిత్యం అక్కడి సహాయకుడే మిగిలిన నిర్వహణ బాధ్యతలూ చూస్తున్నారు.
శ్రీకాకుళం సాంస్కృతికం, పొందూరు, న్యూస్టుడే: జిల్లాలోని గ్రంథాలయాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. కేంద్రగ్రంథాలయంతో పాటు వివిధ మండలాల్లో మొత్తం 44 శాఖాగ్రంథాలయాలున్నాయి. వాటిల్లో 104 మంది శాశ్వత ఉద్యోగులు అవసరంకాగా... కేవలం 34 మందే ఉన్నారు. మరో 14 మంది పొరుగు సేవలు ఉద్యోగులు అక్కడకక్కడా పని చేస్తున్నారు. కొన్నిచోట్ల అసలు గ్రంథాలయ నిర్వహణ చూసే అధికారులే లేరు. మురపాక, సంతకవిటి, టెక్కలి, శ్రీకూర్మం, మెళియాపుట్టి, కొత్తూరు, బూర్జ గ్రంథాలయాలు ఇన్ఛార్జుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం రికార్డు అసిస్టెంట్లు, సహాయకులతోనే నడిపిస్తున్నారు. సుమారు 70 వరకు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దీని ద్వారా గ్రంథాలయాల అభివృద్ధీ కుంటుపడుతోంది. కొందరు ఈ రెండు, మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా... ప్రభుత్వం వారికి రెండేళ్లు పెంచడంతో కొనసాగనున్నారు. ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలిని నియమించారు. ఇప్పటికైనా విజ్ఞాన భాండాగారాల్లో తిష్ఠ వేసిన సమస్యలకు పరిష్కారం చూపాలని అంతా కోరుతున్నారు.
నెలకొన్న ప్రధాన ఇబ్బందులివీ...
* నాలుగైదు చోట్ల తప్ప ఏ గ్రంథాలయం వద్దా మరుగుదొడ్లు లేవు. నీటి సౌకర్యమూ అంతంతమాత్రమే. * పుస్తకాలు చదువుకునేందుకు, భోజనాలు చేసేందుకు గదులు, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. * గ్రంథాలయానికి స్థానిక సంస్థల నుంచి సుమారు రూ.5 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారు. * పది గ్రంథాలయాల్లో అంతర్జాలం ఉన్నప్పటికీ మూడు, నాలుగు చోట్లే కంప్యూటర్లు పని చేస్తున్నాయి. * కేంద్ర గ్రంథాలయానికి వచ్చే అభ్యర్థులు భోజనం చేసేందుకు వసతి లేక పక్కనే ఉన్న తితిదే కల్యాణమండపంలోకి వెళ్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం...
గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఉండటంతో ఆశించినస్థాయిలో అభివృద్ధి జరగట్లేదు. స్థానిక సంస్థల నుంచి రావాల్సిన పన్ను బకాయిలు కూడా వసూలు కావడం లేదు. దీంతో చాలా చోట్ల మౌలిక వసతుల కల్పించలేకపోతున్నాం. ఈ సమస్యలన్నింటినీ ఉన్నతాధికారులకు నివేదించాం.
- కె.కుమార్రాజా, గంథాలయసంస్థ జిల్లా కార్యదర్శి
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా..
జిల్లాలో గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాను. ఇటీవల కేంద్ర గ్రంథాలయంలో సమావేశం నిర్వహించాం. చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై తీర్మానం చేశాం. వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తాం.
- సువ్వారి సువర్ణ, జిల్లా గ్రంథాలయసంస్థ అధ్యక్షురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత