రైల్వే స్టేషన్లో..మౌలిక వసతులు కల్పించండి
శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సభాపతి తమ్మినేని సీతారాం వాల్తేర్ డివిజినల్ రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ సేతుపతిని కోరారు. సోమవారం వంశధార అతిథి గృహంలో డీఆర్ఎంతో పాటు ఇతర అ
ఆమదాలవలసలో వంతెనను పరిశీలిస్తున్న సభాపతి తమ్మినేని సీతారాం,
రైల్వే డీఆర్ఎం అనూప్ కుమార్ సేతుపతి, ఇతర అధికారులు
ఆమదాలవలస పట్టణం, న్యూస్టుడే: శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సభాపతి తమ్మినేని సీతారాం వాల్తేర్ డివిజినల్ రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ సేతుపతిని కోరారు. సోమవారం వంశధార అతిథి గృహంలో డీఆర్ఎంతో పాటు ఇతర అధికారులతో స్పీకరు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రైల్వే అండర్ టన్నెల్లో నిత్యం నీరు నిల్వ ఉంటుందని, దీనిని పరిష్కరించాలని కోరారు. స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణం, ఊసవానిపేట రైల్వేగేటు వద్ద ఓవర్బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
శ్రీకాకుళం రోడ్, నౌపడలో స్టెయిన్లెస్ వంతెనలు..
డీఆర్ఎం అనూప్ కుమార్ సేతుపతి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా శ్రీకాకుళం రోడ్, నౌపడలో రెండు స్టెయిన్లెస్ స్టీలు ఉపయోగించి కాలినడక వంతెనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఊసవానిపేట వద్ద రైల్వే ఓవర్బ్రిడ్జి కోసం రూ.42 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. జులై ఒకటోతేదీ నుంచి పలాస, విశాఖ మధ్య డీఎంయూ రైలు నడపనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం రైల్వే అండర్ టన్నెల్, కాలినడక వంతెన పనులను పరిశీలించారు. డిప్యూటీ డీఆర్ఎం సాహు, రైల్వే అధికారులు, ఆమదాలవలస పుర కమిషనర్ రవిసుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి.. చెల్లికి అప్పు ఇచ్చిన వ్యక్తి జగన్: చంద్రబాబు
[ 23-04-2024]
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
ఇదేనా జగన్.. మీరు చెప్పిన ఊళ్లు..
[ 23-04-2024]
జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది. -
నాలుగో రోజు.. నామినేషన్ల హోరు..!
[ 23-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు ఊపందుకుంది. సోమవారం ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతరులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు. -
పాతపట్నం, ఆమదాలవలసలో ప్రజాగళం
[ 23-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది మాదిరిగానే జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. -
పలాసలో చుక్కలు చూపిన వైకాపా ర్యాలీ
[ 23-04-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు నామినేషన్ సందర్భంగా ప్రచార ఆర్భాటానికి చేపట్టిన ర్యాలీతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల వాసులు విలవిలలాడారు. -
కూలేందుకు సిద్ధంగా ఉన్నా.. కళ్లకు గంతలే..!
[ 23-04-2024]
రాష్ట్రంలో తీర ప్రాంతానికి ముఖద్వారంగా పేర్కొనే ఇచ్ఛాపురం మండలం డొంకూరు వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. -
కాలనీలు కాదు.. జగనన్న కహానీలు
[ 23-04-2024]
మేము కట్టేది కాలనీలు కాదు ఊళ్లు అని సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ సభల్లో గొప్పలు చెప్పారు. అయిదేళ్లలో చాలమంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. -
నేడు ఎచ్చెర్లకు బస్సు యాత్ర
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు రానున్నారు. -
కట్టుకున్నోడిని వదిలేసి.. కపట మాటలు నమ్మేసి
[ 23-04-2024]
పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భర్తకు విడాకులిచ్చి రాగా.. మాటిచ్చిన వ్యక్తి మోసం చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. -
77 మందికి షోకాజ్ నోటీసులు
[ 23-04-2024]
ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 77 మందికి కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్