logo

ఉన్నవి ఖర్చుచేస్తే కదా కొత్త నిధులు వచ్చేది..

మంజూరు చేసిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చుచేస్తే మరిన్ని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని శ్రీకాకుళం, విజయనగరం ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బెల్లాన చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఎంపీ ల్యాడ్‌ ని

Published : 24 May 2022 06:21 IST

ఎంపీలు బెల్లాన, రామ్మోహన్‌నాయుడు


సమీక్షలో పాల్గొన్న ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: మంజూరు చేసిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చుచేస్తే మరిన్ని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని శ్రీకాకుళం, విజయనగరం ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బెల్లాన చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఎంపీ ల్యాడ్‌ నిధుల వినియోగంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ జిల్లాలో రూ.1147.44 లక్షలతో 233 పనులు మంజూరు చేయగా ఇప్పటివరకు కేవలం 42 మాత్రమే పూర్తయ్యాయన్నారు. మిగిలిన వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన మాట్లాడుతూ ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల పరిధిలో రూ.64.16 లక్షలతో 24 పనులు మంజూరు చేసినట్టు చెప్పారు. వీటిలో రెండు మాత్రమే పూర్తయ్యాయన్నారు. తక్షణం వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ మాట్లాడుతూ పనులకు సంబంధించి మంజూరు ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో సీపీవో వి.ఎస్‌.ఎస్‌.లక్ష్మీప్రసన్న, వివిధ ఇంజినీరింగ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని