మామిడి రైతుకు చెట్టంత కష్టం
మామిడి పంట అధికంగా సాగయ్యే జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. వేసవి వచ్చిందంటే చాలు ఊరూరా, ప్రధాన వీధుల్లో విక్రయాలకు మామిడి పండ్ల పోగులే దర్శనమిచ్చేవి. ఎక్కడ చూసినా మధుర ఫలాల సువాసనలే గుప్పుమనేవి. ఈసారి చెట్టుకోపుట్టకో కనిపిస్తున్నాయి.
వెంటాడిన ప్రకృతి వైపరీత్యాలు
నష్టాలతో కుదేలు
- న్యూస్టుడే, రణస్థలం
రణస్థలంలో ఇటీవల గాలులకు రాలిన మామిడికాయలు
మధుర ఫలంగా పిలిచే మామిడి ఈ ఏడాది అందనంత దూరంలో నిలిచింది.. వేసవిలో ఉక్కపోస్తే పండ్లు మగ్గే కాలమని పిలిచేవారు.. నేడు మగ్గేందుకు ఒక పండు కూడా లేకుండా పోయింది.. ఎక్కడపడితే అక్కడ సామాన్యులకు సరసమైన ధరలకే లభించే మామిడి ఎక్కువ రేటుకైనా కొందామన్నా లేకుండా పోయాయి.. కాలానుగుణ పండును రుచి చూద్దామని భావించినా దొరకని పరిస్థితి జిల్లాలో నెలకొంది. పండించిన రైతన్న నిలువునా మునిగిపోయాడు.
మామిడి పంట అధికంగా సాగయ్యే జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. వేసవి వచ్చిందంటే చాలు ఊరూరా, ప్రధాన వీధుల్లో విక్రయాలకు మామిడి పండ్ల పోగులే దర్శనమిచ్చేవి. ఎక్కడ చూసినా మధుర ఫలాల సువాసనలే గుప్పుమనేవి. ఈసారి చెట్టుకోపుట్టకో కనిపిస్తున్నాయి. జిల్లా విభజన తర్వాత దాదాపు 13,172 ఎకరాల్లో పంట సాగైంది. ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి నుంచి సరకు ఎగుమతయ్యేది. కానీ ఈసారి వాతావరణ పరిస్థితులు రైతును నిలువునా కూల్చేశాయి. ఏడాది పాటు రెక్కల కష్టమంతా కరిగిపోయింది. నష్టాల ఊబిలో చిక్కుపోయాడు.
ఎందుకీ పరిస్థితి..
సాధారణంగా మామిడి చెట్లకు పూత నవంబరు, డిసెంబరు నెలల్లో వస్తుంది. ఆ సమయంలో జిల్లాలో ఈసారి తుపాన్లు, అకాల వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో పూత కాకుండా వాటి స్థానంలో కొత్త చిగుళ్లు వచ్చాయి. పిందెలు కాయాల్సిన జనవరి, ఫిబ్రవరి నెలల్లో మామిడి పూత పూసింది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా చీడపీడల బెడద ఎక్కువైంది. పూత నిలబడకపోవడంతో కాపు పూర్తిగా తగ్గిపోయినట్లు ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
గతంలో దిగుబడులు..
గతంలో మామిడి ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నుల మేర దిగుబడి వచ్చేది. ఈసారి కొన్నిరకాల తోటల్లో ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు టన్నుల మధ్యనే వస్తోంది. కొన్ని రకాల్లో అయితే పది శాతం కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు, లీజుకు తీసుకున్న కౌలు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టన్ను ధర రూ.50 వేలు..
జిల్లాలో సాగు ద్వారా ఏడాదికి సరాసరి 60 వేల టన్నుల వరకు దిగుబడి వచ్చేది. టన్ను ధర రూ.35 వేల వరకు విక్రయించేవారు. ఈలెక్కన ఏడాదికి రూ.170 కోట్ల వరకు ఆదాయం ఆర్జించేవారు రైతులు. ఈసారి డిమాండ్ ఉండటంతో టన్ను రూ.50 వేల వరకు పలుకుతున్నా సరకు లేకుండా పోయింది. ఆదాయం రూ.70 కోట్ల వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తీవ్రంగా నష్టపోయిన వైనం..
సాధారణంగా జిల్లాలో మామిడి, జీడి తోటలను కౌలు రైతులు కొన్ని సంవత్సరాలకు లీజుకు తీసుకుంటారు. వాటి సాగు, సస్యరక్షణ చర్యలు చేపడతారు. వచ్చే పంటను విక్రయించుకుంటారు. ఒప్పందం మేరకు రైతులకు నగదు చెల్లిస్తారు. ఈఏడాది కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసలు రైతులు నిర్ణయించిన ధర చెల్లించే పరిస్థితి లేదని వాపోతున్నారు.
జీడి పంటదీ అదే దారి..
జిల్లాలో జీడిమామిడి పంట పరిస్థితి మామిడిలానే ఉంది. విభజిత జిల్లాలో 49,602 ఎకరాల్లో పంట పండిస్తున్నారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి ప్రాంతాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. జీడి ఎకరాకు 4 నుంచి 5 బస్తాలు దిగుబడి వచ్చేది. ఈ ఏడాది పూర్తిగా పోయింది.
42 ఎకరాలు కౌలుకు తీసుకున్నా..
నేను 12 ఏళ్లుగా 42 ఎకరాలు మామిడి లీజుకు తీసుకొని సాగు చేస్తున్నాను. ఎకరాకు ఏడాదికి రూ.8 వేలు చెల్లిస్తున్నాను. ఏటా పది లారీల మేర సరకు విక్రయించేవాళ్లం. రూ.18 లక్షలకు ఆదాయం వచ్చేది. ఈ ఏడాది ఒక లోడుకు కూడా దిగుబడి రాలేదు. ఎకరాకు దుక్కులు, ఎరువులు, సస్యరక్షణ చర్యలకు రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈసారి తీవ్రంగా నష్టపోయాం. కొంతమంది రైతులు లీజు సొమ్ము తగ్గిస్తారు, కొందరు తగ్గించరు.
- మీసాల రమేష్, దేవరాపల్లి, మామిడి కౌలు రైతు
వాతావరణ పరిస్థితుల వల్లే...
ఈ ఏడాది నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్లే మామిడి పంటకు ఈ పరిస్థితి. దీనికితోడు చీడపీడలు దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపాయి. రైతులు దారుణంగా నష్టపోయారు.
- రత్నాల వరప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా