logo

‘సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యం’

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కల నిజం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో టిడ్కో ఇళ్లు రాని లబ్ధిదారులకు జగనన్నకాలనీలో స్థలం కేటాయిస్తూ

Published : 26 May 2022 06:22 IST

పట్టా పంపిణీ చేస్తున్న మంత్రి అప్పలరాజు

పలాస, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కల నిజం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో టిడ్కో ఇళ్లు రాని లబ్ధిదారులకు జగనన్నకాలనీలో స్థలం కేటాయిస్తూ పట్టాలను కాశీబుగ్గ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం సాయంత్రం పంపిణీ చేశారు. గత ప్రభుత్వం మీ అందరి చేత రూ.50 వేలు, లక్ష చొప్పున కట్టించుకుని ఇళ్లు ఇవ్వకుండా మాయమాటలు చెప్పిందని, మీ ఆవేదన ముఖ్యమంత్రి వద్దకు తీసుకుని వెళ్లి స్థలం ఇచ్చేలా చూశామన్నారు. పట్టాలు కొంతమందికి రాలేదని స్థలం మాత్రం కేటాయించామని, వారుకూడా అధికారులను సంప్రదించి ఇంటి నిర్మాణాలు చేసుకోవచ్చునని మంత్రి వివరించారు. మీరంతా కట్టిన డబ్బులు తిరిగి వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. పురపాలక సంఘం అధ్యక్షుడు బళ్ల గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని