ఒకటి నుంచి మరో భారం
జిల్లా ప్రజలపై జూన్ 1 నుంచి మరో భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే రిజిస్ట్రేషన్శాఖ ఇంటి నిర్మాణపు విలువలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. గ్రామీణ, పట్టణ, నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి విలువలను పెంచేందుకు ప్రతిపాదనలను తయారు చేసింది.
ఇంటి నిర్మాణపు విలువ పెంపునకు సన్నాహాలు
న్యూస్ టుడే , బలగ (శ్రీకాకుళం )
జిల్లా ప్రజలపై జూన్ 1 నుంచి మరో భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే రిజిస్ట్రేషన్శాఖ ఇంటి నిర్మాణపు విలువలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. గ్రామీణ, పట్టణ, నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి విలువలను పెంచేందుకు ప్రతిపాదనలను తయారు చేసింది. పెంచిన విలువలు వచ్చే నెల నుంచే అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు సంబంధిత ఉత్వర్వులు అందాయి. వీటిని అమలు చేసే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.
జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వాటన్నింటి పరిధిలో నూతన విలువలు అమలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. అర్బన్ పరిధిలో అడుగు రూ.1,140 ఉన్న విలువ 1,200 చేయనున్నారు. గ్రామీణ ప్రాంతంలో రూ.730 నుంచి రూ.770, మేజరు పంచాయతీలో రూ.1,010 నుంచి రూ.1,060కు పెంచనున్నారు. రేకుల షెడ్లు, పెంకుటిళ్లకు ఇంతవరకు రూ.620 వసూలు చేసేవారు. ఇక నుంచి రూ.650 వరకు పెంచి తీసుకోనున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై ఇది మరింత భారం మోపనుంది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు...
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇంటి నిర్మాణపు విలువ పెరగనుంది. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఏ ప్రాంతంలో ఎంత పెంచాలో కూడా సూచించారు. ఆ మేరకు జూన్ 1 నుంచి నూతన విలువలను అమలు చేయనున్నాం.
- ఆర్.సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటల మామ.. సంక్షేమం మమ..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని పిల్లలందరికీ తనకు తాను మేనమామగా ప్రకటించుకున్న సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను ఎంతో ఉద్ధరించినట్లు గొప్పలు చెబుతారు. -
ఉసురు తీసిన అక్రమ తవ్వకాలు
[ 20-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఇసుక పెళ్లలు పడి ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. -
రెండో రోజు.. ప్రధాన పార్టీల జోరు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వంలో రెండో రోజు సందడిగా సాగింది. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థులు బోణీ చేయగా.. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
నామినేషన్ల కోలాహలం
[ 20-04-2024]
ప్రధాన పార్టీల అభ్యర్థులు శుక్రవారం టెక్కలి, పాతపట్నంలో నామినేషన్లు వేశారు. పాతపట్నంలో కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమానికి కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 20-04-2024]
బాలికలు, మహిళలు సొంత కాళ్లపై నిల్చొని ఉపాధి పొందేందుకు తగిన సహకారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం దశాబ్దాల క్రితం శిక్షణ కేంద్రాలను జిల్లాకు ఓ చోట ఏర్పాటు చేసింది. -
పర్యాటక కేంద్రంగా భావనపాడు: అచ్చెన్న
[ 20-04-2024]
రానున్న రోజుల్లో సంతబొమ్మాళి మండలం భావనపాడును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 20-04-2024]
లావేరు మండలం పెద్దలింగాలవలస సర్పంచి ప్రతినిధి, లుకలాపు అప్పలనాయుడు, ఇతర నేతలు శుక్రవారం భాజపాలో చేరారు. -
వైకాపాకు డోల జగన్ రాజీనామా
[ 20-04-2024]
రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ సఫలం కాలేకపోయిందని డీసీసీబీ మాజీ ఛైర్మన్ డోల జగన్ ఆరోపించారు. -
ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మహిళ మృత్యువాత
[ 20-04-2024]
మండలంలోని పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజినీ (48) ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
నిరాడంబరంగా గౌతు శిరీష నామినేషన్
[ 20-04-2024]
పలాస నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ రెండోరోజు కూటమి అభ్యర్థి గౌతు శిరీష నిరాడంబరంగా వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్ బాబు ర్యాలీగా వచ్చి దాఖలు చేశారు. -
పట్టణంలోనే ఉన్నా.. నిత్యం నరకమే
[ 20-04-2024]
కాలువలు ఉండవు, మట్టి రోడ్లే గతి, విద్యుత్తు దీపాలు కనిపించవు, తాగునీరు సేకరణకు అవస్థలు తప్పవు ఇదీ ఎస్టీ రిజర్వేషన్ పొందిన 4వ వార్డు దుస్థితి. వాస్తవంగా పురపాలకసంఘ బడ్జెట్లోనూ ఎస్సీ, ఎస్టీ వార్డులకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి