ఏటా నిర్లక్ష్యమే పారుతోంది
వంశధార.. జిల్లా అన్నదాతల జీవనధార.. దీనిపై ఆధారపడే అధికశాతం ప్రజలు పంట సాగు చేస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉన్నా ఉపయోగించుకోలేని దుస్థితి. కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరందక ఏటా అన్నదాతలు అవస్థలు పడుతూనే ఉన్నారు. శివారు భూములకు నీటితడి అందటం గగనమే అవుతోంది.
దయనీయ స్థితిలో వంశధార కాలువలు
ఖరీఫ్లో శివారుకు సాగునీరు అనుమానమే..
న్యూస్టుడే, నరసన్నపేట
శిథిలావస్థకు చేరిన ఎడమ ప్రధానకాలువ
వంశధార.. జిల్లా అన్నదాతల జీవనధార.. దీనిపై ఆధారపడే అధికశాతం ప్రజలు పంట సాగు చేస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉన్నా ఉపయోగించుకోలేని దుస్థితి. కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరందక ఏటా అన్నదాతలు అవస్థలు పడుతూనే ఉన్నారు. శివారు భూములకు నీటితడి అందటం గగనమే అవుతోంది. ఓ వైపు కాలువల అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల కాని పరిస్థితి, మరోవైపు ఉన్నవాటి చేసిన పనులూ పూర్తిచేయలేని దుస్థితి రైతులకు శాపంగా మారింది. 1977లో ఆవిర్భవించిన వంశధార కాలువల తలరాత నేటికీ పూర్తిస్థాయిలో మార్పులేదు. వచ్చే ఖరీఫ్లోనూ రైతన్నలకు నీటి కష్టాలు తప్పేలా లేవు..
వంశధార నదీపరివాహక ప్రాంతాల్లోని సాగునీటి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. దీనికితోడు గుర్రపుడెక్క ఏటా వేధిస్తూనే ఉంది. దీనిని తొలగించేందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతున్నా అరకొర చర్యలే తీసుకుంటున్నారు. ఏటా డెక్క ముంచుతూనే ఉంది. ఎడమ ప్రధాన కాలువ మరమ్మతులకు ఒక్క రూపాయి వెచ్చించడం లేదు. 2,400 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటివరకు గరిష్ఠంగా 1,800 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. ఫలితంగా శివారు భూములకు సాగునీరు అందివ్వలేకపోతున్నారు.
టెక్కలి డివిజన్లో కాలువల పరిస్థితి మరింత దయనీయం. ఎడమకాలువ ఆధునికీకరణకు 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రూ.100 కోట్లు మంజూరుచేసినా విడుదలలో జాప్యం వల్ల పనులు ముందుకుసాగలేదు. పలుమార్లు పనుల అంచనాలు పెంచుతూ ప్రస్తుతం రూ.831 కోట్లకు చేరింది. ఇటీవల ఉపాధి నిధులతో రూ.16 కోట్లు మంజూరు చేసినా ఇంకా సాగుతున్నాయి.
నరసన్నపేట డివిజన్ పరిధిలో 2014లో ప్రభుత్వం ఓపెన్హెడ్ కాలువల ఆధునికీకరణకు రూ.74 కోట్లు ఇచ్చినా పూర్తిస్థాయిలో జరగలేదు. పోలాకి మండలంలోని సుసరాం తంపర భూముల అభివృద్ధికి రూ.13 కోట్లదీ అదే పరిస్థితి.
నరసన్నపేట, టెక్కలి డివిజన్లలో కేటగిరి ‘ఎ’ పద్దు కింద మంజూరు చేసిన నిధులతో రెండేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు రూ.9 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా ముందుకు సాగకపోవడం గమనార్హం.
2008లో షట్టర్ల కుంభకోణం సాకుగా చూపి ఇప్పటికీ కాలువలపై షట్లర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో దాదాపు అన్ని కాలువలపైనా షట్టర్ల సమస్య తీవ్రంగా ఉంది. కాలువలపై నీటి నియంత్రణ లేకపోవడంతో నీరంతా వృథా అవుతోంది.
పదిహేనేళ్లుగా షట్టర్ల సమస్యలు
నేను ఐదు ఎకరాల్లో కాలువల దిగువ ఆయకట్టును సాగు చేస్తున్నాను. 15 ఏళ్లుగా కాలువలపై షట్టర్లు లేక నీటి నియంత్రణ కరవైంది. కాలువలపై గడ్డివాములుపెట్టుకుని నీటిని పొలాలకు మళ్లించుకుంటున్నాం. ఎగువ రైతులు నీటిని సకాలంలో విడిచిపెట్టక దిగువ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈపరిస్థితుల నుంచి గట్కెక్కాలంటే వెంటనే షట్టర్లు ఏర్పాటుచేయాలి.- లావేటి మురళీ మోహనరావు, రైతు, తామరాపల్లి
అన్నిచర్యలు తీసుకుంటున్నాం..
వంశధార నదిలో నీటి లభ్యత మేరకు పూర్తిస్థాయిలో సాగు నీరందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే పలు కాలువలపై పనులు పూర్తి చేసుకొని ఖరీఫ్కు సమాయత్తం చేస్తున్నాం.
- డోల తిరుమలరావు, ఎస్ఈ, వంశధార ప్రాజెక్టు
దేశవానిపేట సమీపంలో కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి