logo

లోక్‌అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారం

రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జూన్‌ 26న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు భవనంలో లోక్‌అదాలత్‌ నిర్వహణపై ఇన్స్యూరెన్సు కంపెనీల న్యాయవాదులు,

Published : 28 May 2022 06:53 IST

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి

శ్రీకాకుళం లీగల్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జూన్‌ 26న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు భవనంలో లోక్‌అదాలత్‌ నిర్వహణపై ఇన్స్యూరెన్సు కంపెనీల న్యాయవాదులు, పిటిషనర్ల తరఫు న్యాయవాదులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌అదాలత్‌తో పెండింగ్‌లో ఉన్న కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని, కక్షిదారులు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని