కరోనాతో తల్లి... అనారోగ్యంతో తండ్రి
కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న తల్లిని కరోనా రక్కసి బలి తీసుకుంది.. బాధ్యత తీసుకుంటాడనుకున్న తండ్రి అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లిదండ్రుల రెక్కల కష్టంతో సాగిన కుటుంబంలో మిగిలిన ఇద్దరు బాలికల బతుకు ప్రస్తుతం అగమ్యగోచరమైంది.
పది నెలల వ్యవధిలో కన్నుమూత
అనాథలైన బాలికలు
న్యూస్టుడే, సోంపేట:కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న తల్లిని కరోనా రక్కసి బలి తీసుకుంది.. బాధ్యత తీసుకుంటాడనుకున్న తండ్రి అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లిదండ్రుల రెక్కల కష్టంతో సాగిన కుటుంబంలో మిగిలిన ఇద్దరు బాలికల బతుకు ప్రస్తుతం అగమ్యగోచరమైంది.
అండగా ఉంటా... చిన్నపాటి సహకారం అందిస్తే పిల్లలిద్దరికీ తాను అండగా ఉంటానని పిన్ని గంగా రూపవతి పేర్కొన్నారు. తాను కూడా బతుకు కోసం వలసకూలిగా ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తున్నానని, అక్క చనిపోవడంతో పిల్లల పరిస్థితి గురించి ఆలోచనలో పడ్డానని, బావ కూడా మరణించడంతో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నానని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
కుదిపేసిన కరోనా.. బారువ గాంధీపేటకు చెందిన దవళ జ్యోతి పద్దెనిమిదేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన శ్రీనివాస చైనులు ప్రేమ వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. తల్లిదండ్రులు కాయకష్టంతో పిల్లలిద్దరినీ ఉన్నంతలో చక్కగానే చూసుకుంటూ చదివిస్తున్నారు. పిల్లలు చదువులో రాణిస్తుండడంతో కష్టాన్ని మరిచిపోయి తమకూ మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో జీవిస్తూ వచ్చారు. సాఫీగా సాగుతున్న సంసారాన్ని కరోనా కుదిపేసింది. గతేడాది ఆగస్టులో జ్యోతి(40) మృత్యువాత పడింది. అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తున్న భార్య మరణంతో శ్రీనివాస చైనులు మరింతగా కుంగిపోయి తీవ్ర అనారోగ్యంతో రెండు రోజుల కిందట మృతిచెందాడు. తల్లి మరణించి పదినెలలు తిరగకముందే తండ్రిని కూడా కోల్పోయిన చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది.
చదువులు సాగేదెలా... అనూష సోంపేట మోడల్స్కూలులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఈశ్వరి బారువలోనే ఏడో తరగతి పరీక్షలు రాసింది. ఎటువంటి ఆధారం లేని తాము ఇక ఎలా చదువుకోగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్