ఉపాధి.. యథేచ్ఛగా పక్కదారి!
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కొంతైనా భృతి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. నిరుపేదలకు చెందాల్సిన దీన్ని కొందరు ఘనులు దొరికిన మేర స్వాహా చేసేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది,
రికవరీ చేయాల్సింది రూ.కోటిపైనే..
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం
ఎండలో కష్టపడుతున్నా వీరికి దక్కుతున్నది కొంతే
కంచిలిలో ఇటీవల జరిపిన సామాజిక తనిఖీలో రూ.1,25,446 ఉపాధి నిధులు పక్కదారి పట్టినట్లు డ్వామా అధికారులు నిర్ధరించారు. వెంటనే తిరిగి చెల్లించాలని సంబంధిత సిబ్బంది, మేట్లను ఆదేశించారు. ఇంతవరకూ రికవరీ లేదు.
ఇచ్ఛాపురంలో రూ.63,741, టెక్కలిలో రూ.1,08,759 పక్కదారి పట్టాయని గుర్తించారు. ఇంతవరకు వీటి రికవరీ జాడే లేదు. జిల్లా వ్యాప్తంగా ఇంకా రూ.1.09 కోట్లు నిరుపేద వేతనదారులకు చెందాల్సిన మొత్తాన్ని రికవరీ చేయాల్సి ఉంది.
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కొంతైనా భృతి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. నిరుపేదలకు చెందాల్సిన దీన్ని కొందరు ఘనులు దొరికిన మేర స్వాహా చేసేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది, మేట్లు కుమ్మక్కై మరీ నిధులు కాజేస్తున్నారు. వారు దోచుకున్న దానిలో కొంత మండలస్థాయి అధికారులకీ వాటా వెళ్తుండడంతో వారూ కిక్కురుమనడంలేదు. జేబులు నిండుతుండడంతో క్షేత్రస్థాయిలో వారికెలాంటి తప్పులూ కన్పించడంలేదు. దీంతో నిధుల స్వాహా పర్వం యథేచ్ఛగా సాగిపోతోంది. సామాజిక తనిఖీల్లో ఈ తప్పులు బయటపడుతున్నా రికవరీ చేయలేకపోతున్నారు.
క్షేత్రస్థాయి సిబ్బంది హస్తం..
జిల్లాలో 5.3 లక్షలకు పైగా జాబ్కార్డులున్నాయి. వాటిలో పది లక్షల మందికిపైగా వేతనదారులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది ఉపాధి హామీ పథకం పనులపై ఆధారపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ పనులు పక్కాగా జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొందరు కూలీలు పని చేయకున్నా, అసలు స్థానికంగా లేకున్నా వారు పని చేసినట్లుగా లెక్కిస్తూ క్షేత్రస్థాయి సహాయకులు చూపిస్తున్నారు. వంద మంది పనిచేస్తే 120 మంది చేసినట్లు మస్తర్లు నమోదు చేస్తున్నారని నేరుగా కూలీలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అందుకే తాము ఎంత కష్టపడి పనిచేసినా రోజువారీ కూలీ రూ.190 దాటడం లేదని వాపోతున్నారు.
విచారణలో డొల్లతనం..
పథకం అమలు తీరు, చేసిన పని, జరిగిన చెల్లింపులు ఇలా అనేక అంశాలపై సామాజిక తనిఖీలు జరుగుతాయి. ఏయే మార్గాల్లో నిధులు పక్కదారి పట్టాయనేది ఈ తనిఖీల ద్వారా తేటతెల్లమవుతుంది. ప్రతి చిన్న పనికీ ఎంబుక్ రికార్డులో నమోదు తప్పనిసరి. తనిఖీలు చేసినప్పుడు ఎన్ని నిధులు పక్కదారి పట్టిందీ తెలుస్తుంది. దాన్నీ నిరూపించలేని పరిస్థితి ఉంటోంది. ఇప్పటివరకూ రూ.5 కోట్లు నిధులు వివిధ రూపాల్లో దారి మళ్లాయని సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. కానీ రూ.2.8 కోట్ల రికవరీకి మాత్రమే విచారణ అధికారులు ఆదేశించారు. మిగిలిన రూ.2.2 కోట్లు ఏమయ్యాయో తెలియని దుస్థితి. ఈ విచారణ జరుగుతున్న విధానంలోనూ, పక్కదారి పట్టిన నిధులు నిర్ణయించే అంశంలోనూ గోల్మాల్ జరుగుతున్నట్లు కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సొమ్ము తిరిగి చెల్లించాల్సిందే...
- రోజారాణి, డ్వామా పీడీ
ఉపాధి పనుల్లో నిధులు పక్కదారి పట్టకుండా వ్యవస్థ పటిష్టం చేస్తున్నాం. సామాజిక తనిఖీలు, వ్యక్తిగత విచారణలతో అక్రమాల నిగ్గు తేలుస్తున్నాం. ఎలాంటి పక్షపాతం, ఒత్తిళ్లకు తలొగ్గకుండా రికవరీకి ఆదేశిస్తున్నాం. డబ్బులు చెల్లించని వారి ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద జప్తుచేసి చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయి తనిఖీలు, హాజరు నమోదు, చేసిన పనులకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. పక్కదారి పట్టించిన సొమ్ము తిరిగి చెల్లించాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా జగన్.. మీరు చెప్పిన ఊళ్లు..
[ 23-04-2024]
జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది. -
నాలుగో రోజు.. నామినేషన్ల హోరు..!
[ 23-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు ఊపందుకుంది. సోమవారం ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతరులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు. -
పాతపట్నం, ఆమదాలవలసలో ప్రజాగళం
[ 23-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది మాదిరిగానే జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. -
పలాసలో చుక్కలు చూపిన వైకాపా ర్యాలీ
[ 23-04-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు నామినేషన్ సందర్భంగా ప్రచార ఆర్భాటానికి చేపట్టిన ర్యాలీతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల వాసులు విలవిలలాడారు. -
కూలేందుకు సిద్ధంగా ఉన్నా.. కళ్లకు గంతలే..!
[ 23-04-2024]
రాష్ట్రంలో తీర ప్రాంతానికి ముఖద్వారంగా పేర్కొనే ఇచ్ఛాపురం మండలం డొంకూరు వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. -
కాలనీలు కాదు.. జగనన్న కహానీలు
[ 23-04-2024]
మేము కట్టేది కాలనీలు కాదు ఊళ్లు అని సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ సభల్లో గొప్పలు చెప్పారు. అయిదేళ్లలో చాలమంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. -
నేడు ఎచ్చెర్లకు బస్సు యాత్ర
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు రానున్నారు. -
కట్టుకున్నోడిని వదిలేసి.. కపట మాటలు నమ్మేసి
[ 23-04-2024]
పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భర్తకు విడాకులిచ్చి రాగా.. మాటిచ్చిన వ్యక్తి మోసం చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. -
77 మందికి షోకాజ్ నోటీసులు
[ 23-04-2024]
ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 77 మందికి కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ