logo

బాబోయ్‌ మళ్లీ ఎలుగు!

ఇటీవల కిడిసింగి-వజ్రపుకొత్తూరు గ్రామాల మధ్య ఎలుగుబంటి దాడితో ఒకరి మృతి ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఘటనలు మరవకముందే మళ్లీ ఎలుగు సంచారం గుబులు పుట్టిస్తోంది. తాజాగా కిడిసింగి సమీప

Published : 24 Jun 2022 03:18 IST

తాడివాడ సమీపంలో సంచరిస్తున్న ఎలుగుబంటి

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: ఇటీవల కిడిసింగి-వజ్రపుకొత్తూరు గ్రామాల మధ్య ఎలుగుబంటి దాడితో ఒకరి మృతి ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఘటనలు మరవకముందే మళ్లీ ఎలుగు సంచారం గుబులు పుట్టిస్తోంది. తాజాగా కిడిసింగి సమీప గ్రామమైన తాడివాడ సమీపంలో గురువారం సాయంత్రం ఓ ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. సమీప తోటల్లో నుంచి బీటీ రోడ్డుపైకి రావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. భయంతో పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని కొత్తచెరువు గట్టు మీదుగా పొలాల వైపు వెళ్లిపోయింది. పక్కనే ఉన్న కొండవైపు లేదా అక్కడికి దగ్గర్లో ఉన్న శారదపురం-డోకులపాడు జీడి, కొబ్బరి తోటల్లో వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డోకులపాడు పంచాయతీ పరిధి బాపనివానిపేట తోటల్లో కూడా ఎలుగు తిరిగిన అడుగులు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని