logo

న్యాయవాదులు విధుల బహిష్కరణ

కాకినాడకు చెందిన న్యాయవాది కె.నాగేశ్వరరావుపై కక్షిదారుడు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బెజ్జిపరపు ఫల్గుణరావు తెలిపారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు గురువారం

Published : 24 Jun 2022 03:18 IST

నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు

శ్రీకాకుళం లీగల్‌, న్యూస్‌టుడే: కాకినాడకు చెందిన న్యాయవాది కె.నాగేశ్వరరావుపై కక్షిదారుడు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బెజ్జిపరపు ఫల్గుణరావు తెలిపారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించి విధులు బహిష్కరించాలని తీర్మానించారు. అనుగుణంగా ఒక్కరోజు విధులు బహిష్కరించి కోర్టు వద్ద నిరసన తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపికి వినతిపత్రం అందించారు. దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు జి.వాసుదేవరావు, కార్యవర్గ సభ్యులు అప్పారావు పట్నాయక్‌, శ్రీరంగారావు, సురేష్‌, సాయి, ఎ.రేవతి, సీనియర్‌ న్యాయవాదులు పి.సీతన్నాయుడు, వై మురళీమోహన్‌రావు, ఎస్‌.రమేష్‌, జె.తిరుపతిరావు, ఎ.సత్యనారాయణ, కె.అన్నంనాయుడు, ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని