logo

జిల్లా ఆసుపత్రిలో వైద్యుల్ని నియమించాలి

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో వైద్యులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ డిమాండు చేశారు. ఉత్తరాంధ్ర జాత కార్యక్రమంలో భాగంగా

Published : 24 Jun 2022 03:18 IST

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధులు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో వైద్యులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ డిమాండు చేశారు. ఉత్తరాంధ్ర జాత కార్యక్రమంలో భాగంగా గురువారం టెక్కలి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి ఆర్‌ఎంవో శ్రీరాములు, సిబ్బంది, రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారం కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి కుమారమంగళం, ఉపాధ్యక్షులు విజయగౌరి, శ్రీలక్ష్మి, యూటీఎఫ్‌ నేతలు గిరిధర్‌, అప్పారావు, జనవిజ్ఞానవేదిక జిల్లాఅధ్యక్షుడు కామేశ్వరరావు, కేఎన్‌పీఎస్‌ జిల్లాఅధ్యక్షుడు ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని