పరీక్షల కాలం.. అయోమయం..!
ఏటా జూన్లో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేది. ఏప్రిల్ నాటికి వార్షిక పరీక్షలు పూర్తయి మే నాటికి ఫలితాలు వెల్లడయ్యేవి. విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు పట్టాలతో వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు. రెండేళ్లుగా కరోనా
న్యూస్టుడే, ఎచ్చెర్ల, రణస్థలం
అంబేడ్కర్ విశ్వవిద్యాలయం
ఏటా జూన్లో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేది. ఏప్రిల్ నాటికి వార్షిక పరీక్షలు పూర్తయి మే నాటికి ఫలితాలు వెల్లడయ్యేవి. విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు పట్టాలతో వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ పరిస్థితులు తారుమారయ్యాయి. దీన్ని గాడిలో పెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ సిలబస్ను తగ్గించి సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేలా మార్గదర్శకాలు జారీచేసింది. ఆ మేరకు రాష్ట్రంలో కొన్ని విశ్వవిద్యాలయాలు సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం విడుదల చేశాయి. కానీ జిల్లాలోని బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో చివరి సెమిస్టర్ పరీక్షలు జరగలేదు. మరోవైపు వివిధ రకాల ప్రవేశపరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలైపోయాయి. అసలు పరీక్షలు జరగకుండా వాటికి ఎలా సన్నద్ధం కావాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అనుబంధంగా 14 ప్రభుత్వ, 90 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 50 వేల మంది వివిధ రకాల కోర్సులు చదువుతున్నారు. డిగ్రీ మూడో ఏడాదిలో ఆరో సెమిస్టర్ పరీక్షలు ఇంకా నిర్వహించకపోగా నేటికీ షెడ్యూల్ ఖరారు కాలేదు. ఆంధ్రా విశ్వవిద్యాలయం డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం పది రోజుల కిందటే వెల్లడించడం గమనార్హం.
వేధిస్తున్న సిబ్బంది కొరత...
బీఆర్ఏయూలో శాశ్వత ఆచార్యులు లేక ఉన్నవారిపై అదనపు బాధ్యతలతో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వానికి ఈ సమస్య అనేకసార్లు వర్సిటీ అధికారులు, పాలకమండలి సభ్యులు తెలియజేసినా ఫలితం ఉండటం లేదు. దీంతో డిగ్రీలో ఆరు, పీజీలో నాలుగు, బీఈడీలో నాలుగు, ఇంజినీరింగ్లో ఎనిమిది, బీపీఈడీ, డీపీఈడీ, యోగా వంటి కోర్సుల్లో పరీక్షల నిర్వహణకు జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం స్పందించి శాశ్వత ఆచార్యులు, బోధనేతర సిబ్బందిని నియమిస్తే పరీక్షల నిర్వహణ వ్యవస్థ గాడిన పడేందుకు అవకాశం ఉంటందని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు.
అవకాశాలు కోల్పోతాం...
- కొత్తకోట విజయలక్ష్మి, బీఎస్సీ మూడో సంవత్సరం
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నెలలో డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలు పూర్తయితే వివిధ రకాల సెట్లకు సిద్ధమయ్యేందుకు సమయం ఉంటుంది. ఏయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఆరో సెమిస్టర్ పరీక్షలై ఫలితాలు సైతం వెలువడ్డాయి. మాకు ఇంతవరకు పరీక్షలు జరగలేదు. జులై నెలాఖరు వరకూ పరీక్షలు జరిగితే ప్రవేశపరీక్షలకు ఎప్పుడు సిద్ధమవ్వాలి. దీంతో మంచి కళాశాలల్లో సీట్లు పొందే అవకాశాలు కోల్పోతాం.
షెడ్యూల్ విడుదల చేస్తాం...
- డా.ఎస్.ఉదయ్భాస్కర్, ఎగ్జామినేషన్ డీన్, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం
డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో వాయిదా వేశాం. రెండు, మూడురోజుల్లో షెడ్యూల్ విడుదల చేస్తాం. జులై మూడో వారంలోగా పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి ఫలితాలు విడుదల చేస్తాం. ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన వీసీల సమావేశంలో ఈ అంశంపై చర్చించాం. విద్యాసంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత