logo

అందొచ్చిన కొడుకు... కానరాని లోకాలకు..!

జాతీయరహదారిపై లచ్చన్నపేట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట మండలంలోని బెంకిలి గ్రామానికి చెందిన అర్చకుడు ప్రశాంత్‌ పాడి(25) మృతి చెందాడు. టెక్కలి

Published : 24 Jun 2022 03:18 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: జాతీయరహదారిపై లచ్చన్నపేట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట మండలంలోని బెంకిలి గ్రామానికి చెందిన అర్చకుడు ప్రశాంత్‌ పాడి(25) మృతి చెందాడు. టెక్కలి నుంచి పలాస వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొని రోడ్డు పక్కనున్న వంశధార కాలువలో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం ఓ గీత కార్మికుడు నీటిలో ఉన్న మృతదేహాన్ని, ద్విచక్ర వాహనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై కామేశ్వరరావు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకుతీశారు. ప్రమాదంలో ప్రశాంత్‌ ఎడమకాలు విరిగిపోయింది. ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రశాంత్‌ తండ్రి రామచంద్రపాడి ఓ న్యాయవాది వద్ద గుమస్తా. తల్లి రోజాపాడి గృహిణి. ఓ సోదరి ఉంది. వీరి ఒక్కగానొక్క కొడుకు సుధీర్‌. బతుకుదెరువు కోసం అర్చకవృత్తిని నేర్చుకునేందుకు కొన్నాళ్లుగా టెక్కలిలోని సుధీర్‌శర్మ అనే బ్రాహ్మణుడి వద్దనే ఉంటూ మూడు నెలలకోసారి స్వగ్రామానికి వస్తుంటాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. బుధవారం గ్రామానికి వచ్చిన కుమారుడు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాత్రి వేళలోనే బయలుదేరి వెళ్లిపోయాడన్నారు. గురువారం సాయంత్రం బయటకు వెళ్లిన ప్రశాంత్‌పాడి మృతి చెందాడన్న సమాచారంతో టెక్కలి చేరుకున్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని