అందొచ్చిన కొడుకు... కానరాని లోకాలకు..!
జాతీయరహదారిపై లచ్చన్నపేట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట మండలంలోని బెంకిలి గ్రామానికి చెందిన అర్చకుడు ప్రశాంత్ పాడి(25) మృతి చెందాడు. టెక్కలి
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
టెక్కలి పట్టణం, న్యూస్టుడే: జాతీయరహదారిపై లచ్చన్నపేట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట మండలంలోని బెంకిలి గ్రామానికి చెందిన అర్చకుడు ప్రశాంత్ పాడి(25) మృతి చెందాడు. టెక్కలి నుంచి పలాస వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొని రోడ్డు పక్కనున్న వంశధార కాలువలో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం ఓ గీత కార్మికుడు నీటిలో ఉన్న మృతదేహాన్ని, ద్విచక్ర వాహనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై కామేశ్వరరావు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకుతీశారు. ప్రమాదంలో ప్రశాంత్ ఎడమకాలు విరిగిపోయింది. ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రశాంత్ తండ్రి రామచంద్రపాడి ఓ న్యాయవాది వద్ద గుమస్తా. తల్లి రోజాపాడి గృహిణి. ఓ సోదరి ఉంది. వీరి ఒక్కగానొక్క కొడుకు సుధీర్. బతుకుదెరువు కోసం అర్చకవృత్తిని నేర్చుకునేందుకు కొన్నాళ్లుగా టెక్కలిలోని సుధీర్శర్మ అనే బ్రాహ్మణుడి వద్దనే ఉంటూ మూడు నెలలకోసారి స్వగ్రామానికి వస్తుంటాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. బుధవారం గ్రామానికి వచ్చిన కుమారుడు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాత్రి వేళలోనే బయలుదేరి వెళ్లిపోయాడన్నారు. గురువారం సాయంత్రం బయటకు వెళ్లిన ప్రశాంత్పాడి మృతి చెందాడన్న సమాచారంతో టెక్కలి చేరుకున్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు