logo

పనుల వద్దే కుప్పకూలి..

ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ బింగుపేటకి చెందిన ముంగి సూరయ్య(68) గురువారం ఉపాధిహామీ పనులు చేస్తుండగా మృతిచెందాడు.

Published : 24 Jun 2022 03:18 IST

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ బింగుపేటకి చెందిన ముంగి సూరయ్య(68) గురువారం ఉపాధిహామీ పనులు చేస్తుండగా మృతిచెందాడు. అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పడిత చెరువు(మాడుగుల బంద) పూడికతీత పనులు చేస్తుండగా ఆయాసంగా ఉందని, తాగేందుకు తాగునీరు కావాలని అడిగాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు నీరు తెచ్చేలోగా కుప్పకూలిపోయాడు. ఈయనకు భార్య రాములమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎంపీడీవో ఎం.పావని, ఏపీవో శోభాదేవి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని