logo

వృద్ధురాలి ఆత్మహత్య

పోలాకి మండల పరిధిలోని మబుగాం గ్రామానికి చెందిన ముద్దాడ అప్పల నరసమ్మ(70) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్‌ఐ ఎం.చిరంజీవి తెలిపారు. నరసమ్మ ఫైలేరియా వ్యాధితో

Published : 24 Jun 2022 03:18 IST

మబుగాం(పోలాకి), న్యూస్‌టుడే: పోలాకి మండల పరిధిలోని మబుగాం గ్రామానికి చెందిన ముద్దాడ అప్పల నరసమ్మ(70) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్‌ఐ ఎం.చిరంజీవి తెలిపారు. నరసమ్మ ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్నారని, భరించలేక ఈ పని చేసిఉంటారని ఆమె చిన్న కుమారుడు చినబాబు చెప్పారు. బుధవారం రాత్రి భోజనానికి ఆమెను ఎంత లేపినా లేవకపోవడంతో వెంటనే శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వివరించారు. ఆయన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పేర్కొన్నారు.


బాలిక మృతిపై విచారణ

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో ఇటీవల ఓ బాలిక మృతి చెందిన విషయమై పోలీసులు గురువారం విచారణ జరిపారు. సదరు బాలికను హత్య చేశారని, కుటుంబసభ్యులు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడి మృతదేహాన్ని ఖననం చేసేశారని ఆరోపణలు రావడంపై ఆరా తీశారు. బాలిక తల్లిని గురువారం పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి సీఐ అంబేద్కర్‌ ఆధ్వర్యంలో విచారించారు. ఆ బాలిక అనారోగ్యంతో బాధపడుతుండేదని, ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని తల్లి పోలీసులకు తెలిపింది. దీనిపై ఎస్‌.ఐ. ప్రవళ్లిక మాట్లాడుతూ విచారణ అనంతరం ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని, ఆ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని