వృద్ధురాలి ఆత్మహత్య
పోలాకి మండల పరిధిలోని మబుగాం గ్రామానికి చెందిన ముద్దాడ అప్పల నరసమ్మ(70) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్ఐ ఎం.చిరంజీవి తెలిపారు. నరసమ్మ ఫైలేరియా వ్యాధితో
మబుగాం(పోలాకి), న్యూస్టుడే: పోలాకి మండల పరిధిలోని మబుగాం గ్రామానికి చెందిన ముద్దాడ అప్పల నరసమ్మ(70) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్ఐ ఎం.చిరంజీవి తెలిపారు. నరసమ్మ ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్నారని, భరించలేక ఈ పని చేసిఉంటారని ఆమె చిన్న కుమారుడు చినబాబు చెప్పారు. బుధవారం రాత్రి భోజనానికి ఆమెను ఎంత లేపినా లేవకపోవడంతో వెంటనే శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వివరించారు. ఆయన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు.
బాలిక మృతిపై విచారణ
శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలో ఇటీవల ఓ బాలిక మృతి చెందిన విషయమై పోలీసులు గురువారం విచారణ జరిపారు. సదరు బాలికను హత్య చేశారని, కుటుంబసభ్యులు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడి మృతదేహాన్ని ఖననం చేసేశారని ఆరోపణలు రావడంపై ఆరా తీశారు. బాలిక తల్లిని గురువారం పోలీసుస్టేషన్కు తీసుకువచ్చి సీఐ అంబేద్కర్ ఆధ్వర్యంలో విచారించారు. ఆ బాలిక అనారోగ్యంతో బాధపడుతుండేదని, ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని తల్లి పోలీసులకు తెలిపింది. దీనిపై ఎస్.ఐ. ప్రవళ్లిక మాట్లాడుతూ విచారణ అనంతరం ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని, ఆ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!