వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం
వంశధార నిర్వాసితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రూ.216 కోట్ల అదనపు పరిహారం విడుదల చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శుక్రవారం హిరమండలంలో నిర్వాసితులకు
నమూనా చెక్కు విడుదల చేస్తున్న స్పీకర్ తమ్మినేని, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు ఎమ్మెల్యే రెడ్డి శాంతి, తదితరులు
హిరమండలం, న్యూస్టుడే: వంశధార నిర్వాసితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రూ.216 కోట్ల అదనపు పరిహారం విడుదల చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శుక్రవారం హిరమండలంలో నిర్వాసితులకు చెల్లించేందుకు కేబినెట్ సమావేశంలో ఆమోదించిన అనంతరం రూ.216 కోట్ల నమూనా చెక్కును స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, కలెక్టరు శ్రీకేష్ బి లఠ్కర్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యే రెడ్డిశాంతి విడుదల చేశారు. అంతకముందు కలెక్టర్ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులు, పీడీఎఫ్, యూత్ ప్యాకేజీ మంజూరైన 15 వేల మంది బ్యాంకు ఖాతాలకు లబ్ధి జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబితాలో తప్పిపోయిన వారుంటే దరఖాస్తులను అధికారులకు అందజేయాలన్నారు. మంత్రులు ధర్మాన, అప్పలరాజు స్పీకర్ తమ్మినేని, ఎమ్మెల్యే శాంతి మాట్లాడుతూ శుక్రవారం నుంచే చెల్లింపులు ప్రారంభించారని, 27న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చేలోగా చెల్లింపులు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తెదేపాపై పలు విమర్శలు గుప్పించారు.
బాధితుల ఆగ్రహం..
ఎమ్మెల్యే రెడ్డి శాంతిని నిలదీస్తున్న నిర్వాసితులు
సమావేశం అనంతరం పలు గ్రామాల నిర్వాసితులు స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యే రెడ్డిశాంతికి వారి సమస్యలు తెలియజేసేందుకు యత్నించగా కొందరు అడ్డుకున్నారు. ఆగ్రహంతో ఎమ్మెల్యే రెడ్డిశాంతిని చుట్టుముట్టి నిలదీశారు. గతంలో యూత్ప్యాకేజీ మంజూరుకాని 2 వేల కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తామని ముఖ్యమంత్రి మాటిచ్చారని ఆ మాట నిలబెట్టుకోకుండా అదనపు పరిహారం పేరుతో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా శాంతించలేదు. చివరకు పోలీసులు, వైకాపా నాయకుల సాయంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.