ఉపాధి మార్గం.. అందనంత దూరం..!
ఏ రంగంలో రాణించాలన్నా అందుకు తగిన నైపుణ్యం, శిక్షణ అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ప్రభుత్వం గిరిజనులకు వైటీసీ (గిరిజన యువత శిక్షణ కేంద్రం)ల్లో ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేది. ఆ విధంగా స్వయం ఉపాధి
వైటీసీల్లో నిలిచిన శిక్షణ కార్యక్రమాలు
- న్యూస్టుడే, బలగ(శ్రీకాకుళం)
ఏ రంగంలో రాణించాలన్నా అందుకు తగిన నైపుణ్యం, శిక్షణ అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ప్రభుత్వం గిరిజనులకు వైటీసీ (గిరిజన యువత శిక్షణ కేంద్రం)ల్లో ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేది. ఆ విధంగా స్వయం ఉపాధి కల్పించడంతో పాటు ఉద్యోగాలు సాధించేందుకు తోడ్పాటునందించేది. కరోనా కారణంగా జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ఈ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. వాటిని మళ్లీ పునరుద్ధరించాలని గిరిజన యువత కోరుతున్నారు.
సీతంపేటలోని వైటీసీలో శిక్షణ పొందుతున్న యువత (పాత చిత్రం)
జిల్లాలోని శ్రీకాకుళం, పాతపట్నం, మందస, సీతంపేట ప్రాంతాల్లో గిరిజన యువత శిక్షణ కేంద్రాలు (వైటీసీ) ఉన్నాయి. 2015లో అప్పటి ప్రభుత్వం ఆయా చోట్ల స్వయం ఉపాధి శిక్షణ కోర్సులను ప్రారంభించింది. ఐటీడీఏ(ట్రైకార్) నిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నేతృత్వంలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణలు ఇప్పించేవారు. ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు శిక్షణానంతరం ధ్రువపత్రం అందించేవారు. కొందరికి ఉద్యోగ అవకాశాలు చూపించేవారు. మరికొందరు శిక్షణలో నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకుని ఆయా రంగాల్లో స్థిరపడేవారు. కరోనా ముందు వరకు నాలుగు కేంద్రాల్లో 122 బ్యాచ్ల్లో 3,743 మంది శిక్షణ ఇచ్చారు.
20కిపైగా కోర్సులు..
నాలుగు వైటీసీల్లో అక్కడి వనరుల లభ్యత, ఇతర పరిస్థితులను బట్టి 20కిపైగా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవారు. ఆటో సేల్స్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్, టైలరింగ్, మొబైల్ అసెంబ్లింగ్, తాపీపని, ఫ్లంబింగ్, ఎలక్ట్రీషియన్, డ్రైవింగ్, పుట్టగొడుగుల పెంపకం, తదితర రంగాల్లో తర్ఫీదు అందించేవారు. పట్టభద్రులు, ఇంజినీరింగ్ కోర్సులు చేసిన పేద గిరిజన యువత సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకునేవారు.
11 నెలలుగా జీతాల్లేవు...
జిల్లాలోని గిరిజన యువత శిక్షణ కేంద్రాల్లోని వివిధ విభాగాల్లో కేర్ టేకర్లతో పాటు 24 మంది పని చేస్తున్నారు. వీరు కేంద్రం నిర్వహణతో పాటు ఇతర కార్యకలాపాలు చూస్తుంటారు. 11 నెలలుగా వీరికి జీతాలు ఇవ్వడం లేదు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత అధికారులు చొరవ తీసుకుని వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.
ఎంతో ఉపయోగపడేవి...
- కె.రామలక్ష్మి, పెద్దూరు, గిరిజన యువతి
గిరిజన కుటుంబాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డబ్బులు పెట్టి శిక్షణలు పొందడం కష్టం. గతంలో వైటీసీ ద్వారా పోటీపరీక్షలకు ఉచితంగా ఇచ్చేవారు. అవి ఎంతో ఉపయోగపడేవి. స్వయం ఉపాధి కోర్సులూ నిర్వహించేవారు. కరోనా కారణంగా వాటిని నిలిపివేశారు. మళ్లీ ప్రారంభించలేదు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వైటీసీలº నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సులు ప్రారంభించాలి.
త్వరలో ప్రారంభిస్తాం..
- బి.నవ్య, పీవో, ఐటీడీఏ, సీతంపేట
గిరిజన యువతకు స్వయం ఉపాధి కోర్సులను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైటీసీలో సూపర్-60 పేరిట ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. కొద్దిరోజుల్లో మందస వైటీసీలో టైలరింగ్, తాపీపని, ఇతరత్రా శిక్షణలు ఇప్పించాలని చూస్తున్నాం. ఈ మేరకు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం