logo

Dharmana Krishna Das: హద్దు మీరితే.. జగనన్నకు చెబుతా

పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా, ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళతానని వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ హెచ్చరించారు. నరసన్నపేటలోని ఎన్‌ఏఆర్‌ కల్యాణమండపంలో శుక్రవారం సాయంత్రం పార్టీ

Updated : 25 Jun 2022 11:44 IST

వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

తగ్గేదేలే అంటున్న ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట, న్యూస్‌టుడే: పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా, ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళతానని వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ హెచ్చరించారు. నరసన్నపేటలోని ఎన్‌ఏఆర్‌ కల్యాణమండపంలో శుక్రవారం సాయంత్రం పార్టీ నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ కొందరు అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారని, అలాంటివారిని ఉపేక్షించేది లేదని, పార్టీలో అందరినీ కలుపుకుంటూ నడుచుకోవాలన్నారు. నియోజకవర్గంలో కొందరు అర్థరహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అలాంటివారిని గమనిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లోను తానే వైకాపా అభ్యర్థిని అని నొక్కి చెప్పారు. మీరంతా అనుకుంటున్నట్టు తాను అమాయకుడిని కాదని, అమాయకుడిని అయితే నాలుగుసార్లు గెలిచేవాడిని కాదని, ఈసారి ఎన్నికల్లో తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలోలా మాట్లాడి హావభావాలు ప్రదర్శించారు. అనంతరం విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ అధ్యక్షుడు రాజేశ్వరరావు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు డోల జగన్‌, పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని