logo

సందడిగా ప్రో కబడ్డీ పోటీలు

ఉద్దానం ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా రాష్ట్రస్థాయి పురుషుల, మహిళల ప్రో కబడ్డీ పోటీలు పలాస మండలం బొడ్డపాడులో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి 26 జట్లు రాగా.. ఉద్దానం ప్రాంతం నుంచి 2

Published : 25 Jun 2022 06:04 IST

తలపడుతున్న ఉద్దానం, ప్రకాశం మహిళల జట్లు

పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: ఉద్దానం ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా రాష్ట్రస్థాయి పురుషుల, మహిళల ప్రో కబడ్డీ పోటీలు పలాస మండలం బొడ్డపాడులో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి 26 జట్లు రాగా.. ఉద్దానం ప్రాంతం నుంచి 2 పురుషుల జట్లు, ఒక మహిళల జట్టు మొత్తం 29 జట్లు పాల్గొంటున్నాయి. పోటీలను మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ జెండా ఎగరేసి ప్రారంభించారు. ఒకే ప్రాంగణంలో నాలుగు మ్యాచ్‌లు ఏకకాలంలో జరిగేలా ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు గుంటూరు, కర్నూలు పురుషుల జట్ల మధ్య, ఉద్దానం, ప్రకాశం మహిళల జట్ల మధ్య పోటీలు జరిగాయి. మొదలైన కొద్దిసేపటికే వర్షం కారణంగా తాత్కాలికంగా ఆగిపోయాయి. రేపు కొనసాగిస్తామని... టోర్నమెంట్ 26 వరకూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని