logo

తండ్రి మందలించాడని కుమారుడి బలవన్మరణం

జలుమూరు మండలంలోని లింగాలవలస గ్రామానికి చెందిన గేదెల శ్రీనివాసరావు(24) శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. శ్రీ

Published : 27 Jun 2022 06:09 IST

శ్రీనివాసరావు (పాత చిత్రం)

జలుమూరు, న్యూస్‌టుడే: జలుమూరు మండలంలోని లింగాలవలస గ్రామానికి చెందిన గేదెల శ్రీనివాసరావు(24) శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. శ్రీనివాసరావు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. బెట్టింగ్‌, మద్యానికి బానిసై అప్పుల్లో కూరుకుపోయాడు. విషయం తెలిసి తండ్రి జనార్దనరావు మందలించడంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. చేతికందొచ్చిన కుమారుడు దూరమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. పి.పారినాయుడు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని