logo

ఇంటి నుంచి వెళ్లి... విగతజీవిగా మారి..

కోటబొమ్మాళి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దాట్ల మోహన్‌(27) మండలంలోని హరిశ్చంద్రపురం రైల్వేవంతెన దిగువ పలాస-విశాఖపట్నం మార్గంలో ఆదివారం రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు. మోహన్‌ జాతీయరహదారిపై కొత్తపేట

Published : 27 Jun 2022 06:09 IST

మోహన్‌

కొత్తపేట(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: కోటబొమ్మాళి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దాట్ల మోహన్‌(27) మండలంలోని హరిశ్చంద్రపురం రైల్వేవంతెన దిగువ పలాస-విశాఖపట్నం మార్గంలో ఆదివారం రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు. మోహన్‌ జాతీయరహదారిపై కొత్తపేట వద్ద తండ్రితో పాటు వాటర్‌ప్లాంట్‌ నిర్వహిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఆదివారం రైలు కింద పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఎందుకు.. ఎలా చనిపోయాడనే విషయం తెలియలేదు. ఘటనతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పలాస ఆసుపత్రి తరలించి దర్యాప్తు చేస్తునట్లు జీఆర్పీ ఎస్‌.ఐ. షరీఫ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని