రైలు నిలయంలో సమస్యల కూత..
జిల్లాలో ప్రధానమైనదిగా పేరు గాంచిన శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ ఆదాయంలో ఘనంగా ఉన్నా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించటంలో మాత్రం వెనుకంజలోనే ఉంది. రైల్వేస్టేషన్లో సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్ఫాంపై
న్యూస్టుడే, ఆమదాలవలస పట్టణం, గ్రామీణం
శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్లో పూర్తి స్థాయిలో ప్లాట్ఫాంపై పైకప్పు లేని దృశ్యం
జిల్లాలో ప్రధానమైనదిగా పేరు గాంచిన శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ ఆదాయంలో ఘనంగా ఉన్నా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించటంలో మాత్రం వెనుకంజలోనే ఉంది. రైల్వేస్టేషన్లో సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్ఫాంపై పూర్తి స్థాయిలో పైకప్పు లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వర్షంలో తడుస్తూ రైళ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉన్నట్లు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా 3, 4 ప్లాట్ఫాంలపై పూర్తిగా మరుగుదొడ్లు లేకపోవడంతో వారు 2వ నెంబరు ప్లాట్ఫాం పైకి వచ్చి తమ అవసరాలను తీర్చుకోవల్సి వస్తుంది. రైల్వేశాఖ ఇటీవల నూతనంగా నిర్మించి ర్యాంపు వంతెనను పూర్తిస్థాయిలో నిర్మించకపోవడం, ప్లాట్ఫాంపై పూర్తిస్థాయిలో తాగునీటి కుళాయిలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టేషన్ మీదుగా సుమారు 63 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా స్టేషన్లో 15 వరకు ఇక్కడ ఆగడం లేదు.
సౌకర్యాలు కల్పించాలి
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటూ, ఆదాయంలో ముందు ఉంటున్న శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాలు అంతగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం వస్తున్న ఈ స్టేషన్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రైల్వేశాఖపై ఉంది. -బొనెల అప్పారావు, ఆమదాలవలస
‘‘రైల్వే స్టేషన్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించి డీఆర్ఎం కార్యాలయానికి పంపించాం. వాటిలో కాలి నడక వంతెన ప్రారంభమైంది. మిగతా సమస్యలను కూడా త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం.’’ - ఎం.రవికుమార్, స్టేషన్ మేనేజర్, శ్రీకాకుళం రోడ్ రెలు నిలయం
మరికొన్ని సమస్యలిలా
శాశ్వత పార్కింగ్ షెడ్డు లేకపోవడంతో ఆరుబయటే వాహనాలను ఉంచాల్సి వస్తుంది.
ప్రయాణికుల లగేజీ దాచుకోవడానికి లగేజీ రూంలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
విభిన్న ప్రతిభావంతులు(వికలాంగులు) సౌకర్యార్థం నిర్మించిన లిఫ్టు పనిచేయడం లేదు. ప్లాట్ఫాం పైకి వారిని చేరవేయడానికి ఎటువంటి వాహనాలు లేవు.
రైల్వే ప్లాట్ఫాంకు టిక్కెట్ కౌంటర్ దూరంగా ఉండటంతో ప్రయాణికులు టిక్కెట్ తీసుకొని, తమ లగేజీతో చుట్టూ తిరిగి రైలు వద్దకు చేరుకునేందుకు కొంత సమయం పట్టడంతో కొన్నిసార్లు రైలు ఎక్కలేక వెనుతిరగాల్సి వస్తుంది.
రైలు నిలయం ప్రాంగణంలో పూర్తిస్థాయిలో విద్యుత్తు దీపాలు, రైల్వే పోలీసులు గస్తీ లేకపోవడంతో కొందరు ఆకతాయిలు రాత్రి సమయంలో ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రయాణికులు భయంతో బయటకు వెళ్లాల్సి వస్తుంది.
శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్లో రోజుకు టికెట్ కౌంటర్, పార్శిళ్ల ఆదాయం సుమారుగా రూ.3 లక్షలు
గూడ్సు వ్యాగన్ల ద్వారా ఆదాయం: రోజుకు రూ.10 లక్షలు, నెలకు సుమారు రూ.3 కోట్లకు పైగా
ప్రతి రోజు వచ్చి, వెళ్లే ప్రయాణికులు: సుమారు 1,600 మంది
రోజూ ఆగే రైళ్లు: 48
ప్లాట్ఫాంలు: 4
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?