logo

బెలమాంలో చోరీ..

ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలో ఓ ఇంట్లో 6 తులాల బంగారం చోరీ జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురజాపు ప్రసాద్‌, ఆయన భార్య ఈశ్వరమ్మ శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత పిల్లలను తాతగారి ఇంటివద్ద దించి తిరిగి వచ్చారు

Published : 28 Jun 2022 06:44 IST

వివరాలు సేకరిస్తున్న పోలీసులు

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలో ఓ ఇంట్లో 6 తులాల బంగారం చోరీ జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురజాపు ప్రసాద్‌, ఆయన భార్య ఈశ్వరమ్మ శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత పిల్లలను తాతగారి ఇంటివద్ద దించి తిరిగి వచ్చారు. తలుపులకు తాళాలు వేసి మేడపైన పడుకున్నారు. ఉదయం 4 గంటల సమయంలో ఇంటిలోకి వెళ్లేందుకు కిందకు దిగారు. అప్పటికే తాళాలు పగులగొట్టి తలుపులు తీసి ఉండటంతో పాటు లోపల బీరువా తెరిచి ఉంది. అందులోని ఆరు తులాల బంగారు ఆభరణాలు, పది తులాల వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని