logo

ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా కన్వీనర్ల నియామకం

అఖిల భారత యాదవ మహాసభ ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా కన్వీనర్లను సోమవారం నియమించినట్లు ఆ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు సోంప్రకాష్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం నగరంలోని యాదవ మహాసభ కార్యాలయంలో మహిళా కన్వీనర్ల ఎంపిక జరిగింది.

Published : 28 Jun 2022 06:44 IST


మహిళా కన్వీనర్లతో సోంప్రకాష్‌ యాదవ్‌

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: అఖిల భారత యాదవ మహాసభ ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా కన్వీనర్లను సోమవారం నియమించినట్లు ఆ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు సోంప్రకాష్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం నగరంలోని యాదవ మహాసభ కార్యాలయంలో మహిళా కన్వీనర్ల ఎంపిక జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా కన్వీనర్‌గా భారతి యాదవ్‌, మన్నం జిల్లా మహిళా కన్వీనర్‌గా నైధాన భారతమ్మయాదవ్‌, విజయనగరం జిల్లా మహిళా కన్వీనర్‌గా రమణమ్మ యాదవ్‌ను నియమిస్తూ ఆ విభాగం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కన్వీనర్లు మాట్లాడుతూ యాదవ మహాసభను బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు కన్వీనర్లు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని