ఎంత పనిచేసిన అంతే...!
పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఉపాధి పథకం వరమే. నిత్యం పని దొరుకుతోంది. కానీ వారి శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎంత పనిచేసినా వారికి కనీస వేతనం అందడం గగనంగా మారింది. ఇక గరిష్ఠ వేతనం అందుకోవడం కలగానే కనిపిస్తోంది. చేతులు
ఉపాధి పథకంలో వేతనదారులకు అందని గరిష్ఠ వేతనం
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం
పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఉపాధి పథకం వరమే. నిత్యం పని దొరుకుతోంది. కానీ వారి శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎంత పనిచేసినా వారికి కనీస వేతనం అందడం గగనంగా మారింది. ఇక గరిష్ఠ వేతనం అందుకోవడం కలగానే కనిపిస్తోంది. చేతులు బొబ్బలెక్కేలా కష్టపడుతున్నా అనుకున్న స్థాయిలో వేతనం రాకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మస్తర్లు వేయడంలో కొందరు క్షేత్ర సహాయకుల చేతివాటం కారణంగా కొందరు పని చేయకపోయినా మస్తర్లు వేస్తుండటంతో వారికీ వేతనం అందుతోంది. ఈ మేరకు అసలు పనిచేసిన వారికి తగ్గుతోంది.
రెండు నెలల్లో రూ.33 పెరుగుదల
గతంలో జిల్లాలో రోజుకు 70-80 వేల మంది రోజూ పనులకు వచ్చేవారు. ఇప్పుడు వారి సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. గత నెలలో ఒక్కరోజులో అత్యధికంగా 2.61 లక్షల మంది పనిచేశారు. ఏప్రిల్లో వీరు అందుకున్న సరాసరి వేతనం రూ.139. ఈ పరిస్థితిపై రాష్ట్రస్థాయి అధికారులు, కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత తక్కువ వేతనం రావడంపై అధికారులను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకుని రోజువారీ వేతనం పెరిగేలా చూడాలని ఆదేశించారు. మే 29న సరాసరిన ఒక్కొక్కరూ రూ.154 అందుకోగా ప్రసుత్తం రూ.172 చొప్పున పొందుతున్నారు. గరిష్ఠ వేతనం మాట అటుంచితే అధికారుల నిర్దేశించిన లక్ష్యం రూ.230. దీనికి చేరుకోవడమే సాధ్యమయ్యేలా కనిపించడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వెనుకబడిన కొన్ని మండలాలు..
జిల్లాలో కొన్ని మండలాల్లో సరాసరి వేతనం కొంతమేరకు బాగానే ఉంది. కొన్నిచోట్ల మాత్రం మరీ అధ్వానంగా వస్తోంది. ఏపీవో, క్షేత్రసహాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా వేతన జీవులకు దిశానిర్దేశం చేయలేకపోతున్నారు. గత మూడు నెలల సరాసరి చూస్తే మెళియాపుట్టి, సరుబుజ్జిలి, నరసన్నపేట, గార, జలుమూరు మండలాల్లో వరుసగా రూ.185, రూ.184, రూ.184, రూ.183, రూ.182 చొప్పున అందుకుంటున్నారు. అదే సమయంలో పొందూరు, ఆమదాలవలస, కొత్తూరు, పోలాకి మండలాల్లో సరాసరి వేతనాలు వరుసగా రూ.153, రూ.155, రూ.161, రూ.163 మాత్రమే ఉన్నాయి. వేతనంలో పెంపుదల చూపించడంలో ఈ మండలాలు వెనుకబడుతున్నాయి.
పనిముట్లు పనికిరావు..
వేతనదారులు గరిష్ఠ వేతనం పొందాలంటే చేయాల్సిన పని లక్ష్యాన్ని క్షేత్ర సహాయకులు, మేట్లు చూపించాలి. కొన్నిచోట్ల ఈ విషయంలో సమన్వయ లోపం కనిపిస్తోంది. మరోవైపు పనిముట్లు పదును తగ్గడంతో ఎంత ఎక్కువగా శ్రమించినా తక్కువ పనే జరుగుతోంది. గతంలో శ్రమశక్తి సంఘాల్లోని సభ్యుల ఆధారంగా పదునైన గునపాలు అందించేది. ప్రస్తుతం ఈ సాయం అందడం లేదు.
అవగాహన లేమి..
ఉపాధి పథకం ఇన్నేళ్లుగా అమలులో ఉన్నా కొందరు క్షేత్రసహాయకులు, మేట్లకు ఎంత పని చేస్తే సంఘంలోని సభ్యులకు ఎంతెంత వేతనం వస్తుందనే అంశంపై అవగాహన లేదు. మేట్లకు, క్షేత్రస్థాయి సహాయకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నా . కానీ ఆచరణలో కనిపించడం లేదు.
రోజువారీ సమీక్షిస్తున్నాం..
సరాసరి వేతనం అంశంలో రోజు, మండలాల వారీగా లెక్కగడుతున్నాం. ఎక్కడెక్కడ తక్కువ వస్తుందో ఆయా మండలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన వైఖరి అవలంబిస్తున్నాం. ఇటీవల ఇద్దరు ఏపీవోలతో పాటు పది మంది క్షేత్రసహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. అతి త్వరలోనే లక్ష్యాన్ని చేరుతామనే నమ్మకం ఉంది.
- ఎం.రోజారాణి, పీడీ, డ్వామా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్