బావ ఇంటికే కన్నమేశాడు
వారిద్దరూ ఉపాధ్యాయులు. వరుసకు బావ, బావమరుదులు. ఒకే వీధిలో నివాసముండటంతో బంధం మరింత బలపడింది. అన్ని విషయాలు పంచుకునేవారు. అదే కొంపముంచింది. చివరికి బావ ఇంటికే కన్నమేశాడు ఆ ప్రబుద్ధుడు. పాపం పండిపోవడంతో పోలీసులకు దొరికిపోయిన నిజాన్ని ఒప్పుకుని కటకటాల పాలయ్యాడు.
ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య నలిగిన చోరీ కేసు
ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాధిక
వారిద్దరూ ఉపాధ్యాయులు. వరుసకు బావ, బావమరుదులు. ఒకే వీధిలో నివాసముండటంతో బంధం మరింత బలపడింది. అన్ని విషయాలు పంచుకునేవారు. అదే కొంపముంచింది. చివరికి బావ ఇంటికే కన్నమేశాడు ఆ ప్రబుద్ధుడు. పాపం పండిపోవడంతో పోలీసులకు దొరికిపోయిన నిజాన్ని ఒప్పుకుని కటకటాల పాలయ్యాడు. కొత్తూరులో గతేడాది అక్టోబరు 25న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ జి.ఆర్.రాధిక విలేకర్లకు వెల్లడించారు.కొత్తూరు అఫీషియల్ కాలనీకి చెందిన జన్ని అప్పన్న స్థానిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈయన గతేడాది అక్టోబరు 25న కుటుంబంతో బయటకెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలోని రూ.21.50 లక్షలతో పాటు, 5 తులాల బంగారం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో, ఈ ఏడాది ఏప్రిల్ 30న ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తుండగా అప్పన్న చెల్లెలు భర్త అయిన భామిని మండలం పెద్దదిమిలి గ్రామానికి చెందిన పక్కి ఏడుకొండలుపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై ఆయన నేరాన్ని అంగీకరించారు.
స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం
- న్యూస్టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం
దర్జాగా తాళం తీసుకుని వెళ్లి..
ఏడుకొండలు భామిని మండలం లివిరి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆన్లైన్ ట్రేడింగ్, గేమ్స్, బీట్ కాయిన్స్లో భారీ ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. అసలే కరోనా సమయం, ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇంతలో అప్పన్న కుమారుడికి వివాహం జరగడంతో ఇంట్లోనే నగదు ఉన్నట్లు తెలుసుకున్నాడు. అప్పన్న ఇంటి తాళం ఎక్కడ ఉంటుందో గ్రహించిన ఏడుకొండలు దర్జాగా తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. బీరువాలో ఉన్న నగదు, బంగారంతో వెళ్లిపోయాడు. చోరీ చేసిన రూ.21.50 లక్షలు ఒకేసారి బ్యాంకులో జమ చేస్తే దొరికిపోతానని భావించి ఇంట్లోనే ఉంచాడు. చివరికి చిక్కాడు. నిందితుడి నుంచి పోలీసులు నగదు, బంగారం స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. అదనపు ఎస్పీ(కైమ్స్) పి.విఠలేశ్వరరావు పర్యవేక్షణలో కేసును ఛేదించిన కొత్తూరు సీఐ చంద్రమౌళి, క్రైమ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం