సూర్యాస్తమయాన ఉదయించిన సిక్కోలు
దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్న వేళ.. స్వాతంత్య్ర పోరాట ఫలాలు ఆస్వాదిస్తున్న క్షణాలు.. బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సమయాలు.. ఆ సంతోష వేడుకలను కనులారా చూసింది సిక్కోలు గడ్డ.. అదే పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుంది..
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో జిల్లా సాధన
- ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్టుడే, సాంస్కృతికం
దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్న వేళ.. స్వాతంత్య్ర పోరాట ఫలాలు ఆస్వాదిస్తున్న క్షణాలు.. బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సమయాలు.. ఆ సంతోష వేడుకలను కనులారా చూసింది సిక్కోలు గడ్డ.. అదే పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుంది.. ఆలన..పాలన పరంగా ఎదురవుతున్న సమస్యలకు స్వస్తిపలకాలనుకుంది.. అంతే.. సిక్కోలు జిల్లా డిమాండ్కు శ్రీకారం చుట్టింది.. ఉద్యమాలు, డిమాండ్ల ఫలితంగా ఏరోజైతే స్వాతంత్య్రం రుచి చూశారో.. అదే రోజు ప్రకటనతో ఇక్కడి ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.. ‘ఆజాదీకా అమృత మహోత్సవాలు’ సందర్భంగా నాటి ఘట్టాలను స్మరించుకుందాం.. పోరాట స్ఫూర్తిని అందుకుని, జిల్లా అభివృద్ధికి బాటలు వేద్దాం..
ఒడిశా నుంచి ప్రత్యేక విశాఖపట్నం ప్రత్యేక జిల్లాగా 1936లో ఏర్పాటైంది. అప్పట్లో శ్రీకాకుళం విశాఖలో ఒక రెవెన్యూ డివిజన్గా మాత్రమే ఉండేది. అభివృద్ధి, పరిపాలనాపరంగా అనేక సమస్యలను ఎదుర్కొనేవారు ఇక్కడి ప్రజలు. దీంతో స్వాతంత్య్రం నాటికి అంటే 1948 నాటికే జిల్లా ఏర్పాటుకు స్థానిక నాయకులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వం అంగీకరించినా జిల్లా కేంద్రం ఎంపికలో విభేదాలొచ్చాయి. ఫిబ్రవరిలో జిల్లా ఏర్పాటు చేయాలని భావించినా జాప్యం చోటుచేసుకుంది. స్వాతంత్య్రం అనంతరం కూడా సిక్కోలు నాయకులు వెనుకడుగు వేయలేదు. జిల్లా ఏర్పాటుకు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
బలమైన డిమాండ్..
1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిల్లా ప్రముఖుల దృష్టి అంతా జిల్లా ఏర్పాటుపైనే పడింది. 1950 జులై 17న ఆనాటి రెవెన్యూ శాఖ మంత్రి హెచ్.సీతారామరెడ్డి శ్రీకాకుళం ప్రాంత పర్యటనకొచ్చే ముందు చల్లా నర్సింహులు నాయుడు, పుల్లెల వెంకట రమణయ్య విజయనగరం వెళ్లి జిల్లా కేంద్రంగా శ్రీకాకుళాన్నే ఎంపిక చేయాలని కోరారు. దీంతో సీతారామరెడ్డి శ్రీకాకుళంలో కొన్ని ప్రదేశాలు స్వయంగా చూశారు. సీతారామిరెడ్డికి నచ్చజెప్పిన బృందంలో రొక్కం రామ్మూర్తి(ఎమ్మెల్యే), పసగాడ సూర్యనారాయణ, బరాటం వెంకట రమణయ్య, మంగు రాఘవరావు ఉన్నారు. బలిజేపల్లి నాగేశ్వర శాస్త్రి ప్లానులు, మ్యాపులతో మంత్రికి వివరించారు.
* ఉద్యమ కాలంలో మద్రాసు రాజధానిగా ఉన్నందువల్ల ఈ చివరగా ఉన్న విశాఖ జిల్లాను విభజించి శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు, డిమాండ్లు అందాయి. ఆ రోజుల్లో కోల్కతా, మద్రాసు మధ్య ఒక మెయిల్ రైలు మాత్రమే నడిచేది. ఉదయం ఆరు గంటలకు ఇచ్ఛాపురంలో మెయిల్ ఎక్కితే తూర్పుగోదావరి సరిహద్దున ఉన్న తుని రైల్వేస్టేషన్కు చేరుకోవడానికి సాయంత్రం ఆరు గంటలయ్యేది. అంటే 12 గంటలపాటు ఒకే జిల్లాలో మెయిల్ ప్రయాణం జరిగేది.
నాటి కలెక్టరేట్
పెట్రోమాక్స్ వెలుగుల నడుమ..
ఇక్కడి నాయకుల అభిప్రాయం మేరకు 1950 జులై చివరిలో రెవెన్యూ మంత్రి హెచ్.సీతారామరెడ్డి శ్రీకాకుళం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం 1950 ఆగస్టు 15న సూర్యాస్తమయం సమయంలో శ్రీకాకుళం అవతరించింది. అదేరోజు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అవతరణ కార్యక్రమాన్ని కలెక్టర్ షేక్ అహ్మద్ తన నివాసం నుంచి ప్రస్తుత జిల్లా జడ్డి కోర్టు భవన సముదాయంలో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. దారిమధ్యలో ఆయన వాహనం చెడిపోవడంతో మరో వాహనాన్ని పంపించారు. ఆయన వచ్చేసరికి సూర్యస్తమయం అయింది. చీకటి అలముకుంది. అప్పటికప్పుడు పెట్రోమాక్స్ లైట్ల కాంతిలో కార్యక్రమం జరిపించారు. అలా శ్రీకాకుళం జిల్లా అవతరించింది.
తొలి కలెక్టరు జనాబ్ షేక్ అహ్మద్..
జిల్లా ఏర్పడేనాటికి కలెక్టర్గా ‘మిస్టర్ వైట్’ ఉండేవారు. 1950 ఆగస్టు 15న జిల్లా ఏర్పడిన తర్వాత జనాబ్ షేక్ అహ్మద్ తొలి కలెక్టరుగా నియమితులయ్యారు. 1951 జనవరి 31న జిల్లా బోర్డు అధ్యక్షుడి ఎన్నిక విశాఖ జిల్లా బోర్డు భవనంలో జరిగింది. 1959 డిసెంబరు ఒకటిన అధికారికంగా ఏర్పాటైన బోర్డుకు బెండి కూర్మన్న అధ్యక్షుడిగా, కొత్తపల్లి పున్నయ్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
మళ్లీ విభజన..
* 1979లో శ్రీకాకుళం నుంచి విజయనగరం జిల్లా ఏర్పడింది. తర్వాత మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాలకు పరిమితమైంది. తాజాగా ఇదే ఏడాది రాజాం నియోజకవర్గం విజయనగరంలోనూ, పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలోనూ విలీనం కావడంతో పలాస, టెక్కలి, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లలోని 30 మండలాలతో సిక్కోలు జిల్లాగా నిలిచింది.
అనేక మార్పులు...
1950 నాటికి సాలూరు, బొబ్బిలి తాలూకాలు శ్రీకాకుళంలోనే ఉండేవి. 1969లో సాలూరు తాలూకాలోని 63 గ్రామాలు, బొబ్బిలిలోని 44 గ్రామాలను విశాఖ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన గజపతినగరం తాలూకాకు బదలాయించారు. మళ్లీ 1979 మేలో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను విలీనం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్