ఇదీ తీరు... సురక్షితమేనా నీరు?
జలం.. అందరికీ ప్రాణాధారం. అలాంటి మంచినీరే కలుషితమైతే ప్రజలు డయేరియా, కామెర్లు వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వహిస్తోంది. నగరవాసులు తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు మురుగు కాలువల్లో ఉంటున్నాం.. వాల్వులకు లీకులు ఏర్పడుతున్నా మొక్కుబడి చర్యలతో
మురుగు నీటిలో తాగునీటి పైపులైన్లు
న్యూస్టుడే, శ్రీకాకుళం నగరం
గొంటివీధిలోని మురుగునీటిలో వ్యక్తిగత కుళాయి పైపులైను
జలం.. అందరికీ ప్రాణాధారం. అలాంటి మంచినీరే కలుషితమైతే ప్రజలు డయేరియా, కామెర్లు వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వహిస్తోంది. నగరవాసులు తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు మురుగు కాలువల్లో ఉంటున్నాం.. వాల్వులకు లీకులు ఏర్పడుతున్నా మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారు. క్లోరినేషన్ సైతం అరకొరగా చేపడుతుండటంతో తాగునీరే సురక్షితమేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
నగరంలోని పుణ్యపువీధి, ఇల్లీసుపురం, చిన్నబరాటం వీధి, గూనపాలెం, బలగ హడ్కోకాలనీ, రైతుబజార్తో పాటు వివిధ ప్రాంతాల్లో వ్యక్తిగత కుళాయిల పైపులైన్లులో దాదాపు 50 శాతం మురుగు కాలువల్లోనే ఉన్నాయి. చాలా చోట్ల ఇనుప పైపులైన్లు నిత్యం ఈ మురుగు నీటిలో ఉండటంతో నాని తుప్పుపట్టి పోతున్నాయి. వాటిపైన గతంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రబ్బరు లాంటిది సైతం కానరావట్లేదు. కొన్ని చోట్ల పరిస్థితి చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. దీనిపై నగరవాసులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.
మేల్కోకుంటే తప్పదు ముప్పు: గతంలో రాష్ట్రంలోని గుంటూరు కార్పొరేషన్లో పైపులైన్లు లీకుతో మురుగు కాలువల్లో నీటితో కలుషితమైంది. ఆ నీరు తాగి ప్రజలు వందల సంఖ్యలో ఆస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలికల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరంలోనూ నీటిసరఫరా చేసే ముందు ఆ నీటి నమూనాలను తీసుకుని నాణ్యతా ప్రమాణాలు తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించేవారు. సురక్షితం అని నిర్ధారణ అయిన తరువాత సరఫరా చేసేవారు. క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేసేవారు. నాణ్యమని తేలిన తరువాతే రిజర్వాయర్లకు పపంఏవారు. ప్రస్తుతం అవేమీ జరగడం లేదు. పూర్తిస్థాయిలో క్లోరినేషన్ చేస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. గుంటూరు ఘటన జరిగిన తరువాత నగరంలో మురుగునీటిలో ఉన్న కుళాయిన పైపులైన్లను సుమారు 500కుపైగా గుర్తించి మార్చారు. ఆ తరువాత మళ్లీ విస్మరించడంతో అధిక సంఖ్యలో వ్యక్తిగత కుళాయిలు, పైపులైన్లు మురుగునీటి కాలువల్లోనే కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో మురుగునీటి కాలువలో కనిపిస్తున్నది పి.ఎన్.కాలనీ నుంచి బైరివానిపేట, సీపన్నాయుడుపేటకు వెళ్లే ప్రధాన పైపులైను. దీని ద్వారా సుమారు 500కుపైగా కుళాయిలకు నీటి సరఫరా జరుగుతుంది. కాలువలో ప్రవాహం పెరిగితే కొన్నిసార్లు పైపులైన్ కనిపించని పరిస్థితి కూడా ఉంటుంది. ఇది ఏ మాత్రం లీకేజీకి గురైన తాగునీరు కలుషితంకాక తప్పదనేది స్పష్టమవుతోంది.
డివిజన్లలో సర్వే చేయిస్తాం...
నగరంలో మురుగు కాలువల్లో ఉన్న పైపులైన్లను కొంత మేర మార్చాము. ఈ విషయమై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. మరోసారి అన్ని డివిజన్లలో సర్వే చేయిస్తాం. అక్కడి పరిస్థితి ఆధారంగా అవసరమైన చోట పైపులైన్లను మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. నీటి పరీక్షలు, క్లోరినేషన్పై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
-చల్లా ఓబులేసు, నగరపాలక సంస్థ కమిషనర్, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?