యువత ఇంట.. పాడిపంట..!
వారంతా ఉన్నత చదువులు అభ్యసించారు. కానీ ఎక్కడికో వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడలేదు. ఉన్నఊరిలో స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. తమతో పాటు మరికొందరికి ఆర్థిక భరోసా ఇవ్వాలనే పాడిబాట పట్టారు. బ్యాంకు నుంచి రుణం పొంది విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.
చల్లవానిపేట వద్ద పాడి పరిశ్రమలో ఉన్న ఆవుల్కు
జలుమూరు, నరసన్నపేట, న్యూస్టుడే: వారంతా ఉన్నత చదువులు అభ్యసించారు. కానీ ఎక్కడికో వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడలేదు. ఉన్నఊరిలో స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. తమతో పాటు మరికొందరికి ఆర్థిక భరోసా ఇవ్వాలనే పాడిబాట పట్టారు. బ్యాంకు నుంచి రుణం పొంది విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్న జలుమూరు మండలం చల్లవానిపేటకు చెందిన యువతపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం..
గ్రామానికి చెందిన వైద్యభూషణ సతీష్, పాలవలస ప్రదీప్, వాసుదేవరావు పట్నాయక్ బాగా చదువుకున్నారు. స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో బ్యాంకు నుంచి రూ.20 లక్షలు రుణం పొందారు. చెరో కొంత నగదు పోగు చేసి 17 పాడిఆవులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం రోజుకు 120 లీటర్ల పాలు అమ్ముతున్నారు. మరో 50 నాటుకోళ్లు పెంచుతూ వాటి గుడ్లను విక్రయిస్తున్నారు. రెండెకరాల విస్తీర్ణంలో పశు దాణాను పెంచుతున్నారు. యువకులే సొంతంగా దాణాను తెచ్చి యంత్రాల సాయంతో చిన్నచిన్న ముక్కలు చేసి ఆవులకు వేస్తున్నారు. తీసిన పాలలో విశాఖడెయిరీకి కొంతమేర పాలు ఇస్తూ లీటరుకు రూ.38 పొందుతున్నారు. ప్రైవేటు వర్తకులకు అమ్మి లీటరు పాలకు రూ.50 పొందుతున్నారు. ఇలా నెలకు రూ.1.20 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. మరో నలుగురికి ఉపాధి చూపుతున్నారు.
మరింత విస్తరిస్తాం...
ఎంసీఏ చదువు పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధపడ్డాను. ఇంతలో కొవిడ్ రావడంతో ఎలాంటి పోటీ పరీక్షలు లేవు. దాంతో చేసేది లేక పాడి పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన కలిగింది. మా పెద్దలను సంప్రదించి పాడి పరిశ్రమ ఏర్పాటు చేశాం. విడతల వారీగా దీన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నాం.
-వైద్యభూషణ సతీష్, ఎంసీఏ విద్యార్థి, చల్లవానిపేట
మిత్రుని ఇంటి వద్ద చూసి..
చిన్నప్పుడు నా స్నేహితుడి ఇంటికి వెళ్తే అక్కడ వారు పాడిపరిశ్రమను నిర్వహించేవారు. అప్పుడే నాలో స్వగ్రామంలోనే వాటి ద్వారా ఆదాయం పొందాలనే ఆలోచనవచ్చింది. ముగ్గురి అభిప్రాయాలు కలవడంతో పాడిపరిశ్రమ ఏర్పాటు చేశారు. యాంత్రీకరణను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.
- పాలవలస ప్రదీప్, బీఎస్సీ
సంతృప్తిగా ఉంది...
ఉన్నత చదువులు చదివి ఎవరి వద్దో పనిచేసే కన్నా సొంతంగా అభివృద్ధి చేందాలన్నది నా ఆలోచన. చివరికి ఇలా పాడిపరిశ్రమ ఏర్పాటుచేసి సొంతంగా పశువులకు దాణా అందించడం, వాటి బాగోగులు చూడటం, రాత్రింబవళ్లు పరిశ్రమ వద్ద ఎక్కువసేపు గడిపి మరింత పాల దిగుబడి పెంచేలా కృషి చేస్తున్నాం. తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్న సంతృప్తి కలుగుతుంది.
-వాసుదేవరావు పట్నాయక్, ఎంబీఏ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.