logo

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కిడ్నాప్‌ కలకలం

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఓ వైద్యుడి కిడ్నాప్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి విజయనగరం రోడ్డులో ఉన్న హాస్పిటల్‌ వైద్యుడిని ఇద్దరు

Published : 10 Aug 2022 15:07 IST

శ్రీకాకుళం (నేరవార్తలు): శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఓ వైద్యుడి కిడ్నాప్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి విజయనగరం రోడ్డులో ఉన్న హాస్పిటల్‌ వైద్యుడిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌నకు యత్నించారు. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని గూడెన సోమేశ్వరరావు తన ఇంటి మెట్లు దిగుతుండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనపై వస్త్రం కప్పి అపహరించే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన సోమేశ్వరరావు వారిని బలంగా తోసేశారు. దీంతో వారు మెట్లపై పడిపోయారు. సోమేశ్వరరావు కేకలు వేయడంతో ఆస్పత్రి సిబ్బంది బయటకు వచ్చారు. నిందితుల్లో ఒకరైన రాజు వెంట తెచ్చుకున్న కారులో పారిపోగా.. మరో నిందితుడు పరమేశ్‌ స్థానికులకు చిక్కాడు. దీంతో రెండో పట్టణ పోలీసులు పరమేశ్‌ను స్టేషన్‌కు తరలించారు. మరో నిందితుడు రాజు కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని