logo

ఊరూరా త్రివర్ణ శోభ..

వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.. చిన్నా, పెద్దా జెండా చేతబట్టి దేశభక్తిని చాటింది.. ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ, వీరుల త్యాగాలను స్మరిస్తూ సాగిన ర్యాలీలతో పుర వీధులు త్రివర్ణ శోభను సంతరించుకున్నాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం అధికారులు,

Published : 12 Aug 2022 05:04 IST

వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.. చిన్నా, పెద్దా జెండా చేతబట్టి దేశభక్తిని చాటింది.. ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ, వీరుల త్యాగాలను స్మరిస్తూ సాగిన ర్యాలీలతో పుర వీధులు త్రివర్ణ శోభను సంతరించుకున్నాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం అధికారులు, విద్యాసంస్థలు, వివిధ వర్గాల ప్రజల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఏడురోడ్ల కూడలి మీదుగా పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని ఎస్పీ రాధిక ప్రారంభించారు. టెక్కలి పట్టణంలో 350 అడుగుల జెండాతో ప్రైవేటు విద్యాసంస్థలు ర్యాలీ చేపట్టారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
- శ్రీకాకుళం నేరవార్తా విభాగం, టెక్కలి, టెక్కలి పట్టణం  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు