ఇది అక్రమార్కుల పాలన
రాష్ట్రంలో అక్రమార్కుల పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బుద్దా వెంకన్న ఆరోపించారు. గురువారం పలాస, శ్రీకాకుళం నగరంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు
తెదేపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బుద్దా వెంకన్న ఆరోపణ
శ్రీకాకుళం: ‘బాదుడే బాదుడు’లో కరపత్రం అందిస్తున్న వెంకన్న, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, ఇతర నాయకులు
కాశీబుగ్గ, గుజరాతీపేట, న్యూస్టుడే: రాష్ట్రంలో అక్రమార్కుల పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బుద్దా వెంకన్న ఆరోపించారు. గురువారం పలాస, శ్రీకాకుళం నగరంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అక్రమార్కులేనని ఆరోపించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు రాజకీయాలు, పదవులకు ఉన్న విలువ తెలియదన్నారు. ఒకేసారి 150 మందిని తిరుపతి వీఐపీ దర్శనానికి తీసుకెళ్లడంతో 15 వేల మంది భక్తులు ఇబ్బంది పడ్డారన్నారు. ప్రతిపక్షాలకు ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం తప్ప ఇతర విషయాలు పట్టవా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించడం అర్థరహితమని బుద్దా పేర్కొన్నారు. మంత్రి పదవి రాక ముందు జగన్ను విమర్శించిన ధర్మాన నేడు పదవి ఇచ్చాక మాటమార్చారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల గురించి హేళన చేసి మాట్లాడితే తాట తీస్తామన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తుంటే పోలీస్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎంపీ మాధవ్ వ్యవహారంలో అనంతపురం ఎస్పీ మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా