logo

ఫోన్‌ వచ్చింది..పెళ్లి ఆగింది..!

మరికొన్ని గంటల్లో వారిద్దరికీ పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకు పెళ్లికుమార్తె బంధువులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లికొడుకు సైతం కల్యాణ మండపానికి చేరుకున్నాడు.. అందరూ విందు వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు

Published : 12 Aug 2022 05:04 IST

వివాహానికి ముందే బయటపడిన వరుడి మోసం

కొత్తూరు, న్యూస్‌టుడే: మరికొన్ని గంటల్లో వారిద్దరికీ పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకు పెళ్లికుమార్తె బంధువులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లికొడుకు సైతం కల్యాణ మండపానికి చేరుకున్నాడు.. అందరూ విందు వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో వధువు తరఫు వారికి ఓ ఫోన్‌ వచ్చింది.. అంతే.. జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.. ఈ ఘటన కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా వేదాయపాలెం గ్రామానికి చెందిన బతకల సాయిసందీప్‌(27)కు ఓ వివాహ వెబ్‌సైట్‌లో పారాపురం గ్రామానికి చెందిన యువతితో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. గురువారం బత్తిలి రోడ్డులోని కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిర్ణయించి వధువు తరఫు బంధువులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఓ మహిళ వధువు తరఫు వారికి ఫోన్‌ చేసి సాయిసందీప్‌కు నెల్లూరు జిల్లాలో మరో మహిళతో సంబంధమున్నట్లు తెలిపింది. దీన్ని విచారించగా అది నిజమని తేలింది.  బాధిత కుటుంబీకులు వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. వరుడు సందీప్‌పై కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ గోవిందరావు తెలిపారు. ద]ర్యాప్తు అనంతరం చర్యలు చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని