logo

జడ్పీ సీఈవోగా రామన్‌ నియామకం

జిల్లా పరిషత్తు సీఈవోగా ఆర్‌.వెంకట్రామన్‌ను నియమిస్తూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం ఎంపీడీవోగా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రామన్‌కు ఉద్యోగోన్నతి కల్పించి

Published : 12 Aug 2022 05:04 IST

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్తు సీఈవోగా ఆర్‌.వెంకట్రామన్‌ను నియమిస్తూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం ఎంపీడీవోగా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రామన్‌కు ఉద్యోగోన్నతి కల్పించి జడ్పీ సీˆఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న లక్ష్మీపతిని విశాఖపట్నం డీఆర్‌డీఏ పీడీగా బదిలీ చేశారు.
ః పలువురు ఎంపీˆడీవోలకు ఉద్యోగోన్నతి: జిల్లాలోని పలువురు ఎంపీˆడీవోలకు ప్రభుత్వం ఉద్యోగోన్నతులు కల్పించింది. రాజాం డ్వామా ఏపీడీగా పి.రాధ, శ్రీకాకుళానికి ఆర్‌.స్వరూపారాణి, సాలూరుకి బి.లవరాజును, పాలకొండ డీఎల్‌డీవోగా గోపాలకృష్ణ, టెక్కలికి అలివేలుమంగ, శ్రీకాకుళం వాసుదేవరావును నియమించారు. డీఆర్‌డీఏ పీడీగా విద్యాసాగర్‌ నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని