logo

నదిలో గుర్తుతెలియని మృతదేహం గుర్తింపు

నరసన్నపేట మండలంలోని గోపాలపెంట సమీపంలో వంశధార నదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. నదిలో ఇసుకరేవు సమీపంలో అది కనిపించింది. నీటి ప్రవాహానికి

Published : 12 Aug 2022 05:04 IST

నరసన్నపేట, న్యూస్‌టుడే: నరసన్నపేట మండలంలోని గోపాలపెంట సమీపంలో వంశధార నదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. నదిలో ఇసుకరేవు సమీపంలో అది కనిపించింది. నీటి ప్రవాహానికి మృతదేహం కొట్టుకువచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో గోపాలపెంట ఇసుకరేవు వద్ద ఒడ్డుకు చేరి ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం పోలీసులకు సమాచారమందించారు. మృతదేహం ఉబ్బిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని