logo

గౌరవించడం మన కర్తవ్యం

స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకొని గౌరవించడం మన కర్తవ్యమని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు. అజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో తెదేపా

Published : 12 Aug 2022 05:04 IST

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకొని గౌరవించడం మన కర్తవ్యమని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు. అజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన త్రివర్ణ పతాక ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాకు చెందిన సమరయోధులు గౌతు లచ్చన్న త్యాగాలు మరువ లేనివన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ సమరయోధుల త్యాగాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తొలుత మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, గౌతు లచ్చన్న, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలాసలోని పార్టీ కార్యాలయం నుంచి కాశీబుగ్గ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు చౌదరి బాబ్జీ, విఠల్‌, నాగరాజు, కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, శ్రీనివాసరావు, తాతారావు, శశిభూషణరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని