సిక్కోలు సిగలో ప్రగతి ఫలాలు
సిక్కోలు.. రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతాల్లో ఒక్కటి.. ఈ మాటను రూపుమాపుకొంటూ రాజకీయ, సామాజిక చైతన్యంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల కాలంలో జిల్లా ఒక్కో రంగంలో ప్రగతి మెట్లు ఎక్కుతూ పయనిస్తోంది. ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటూ, ప్రకృతి విపత్తులను అధిగమిస్తూ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది.
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం
సిక్కోలు.. రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతాల్లో ఒక్కటి.. ఈ మాటను రూపుమాపుకొంటూ రాజకీయ, సామాజిక చైతన్యంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల కాలంలో జిల్లా ఒక్కో రంగంలో ప్రగతి మెట్లు ఎక్కుతూ పయనిస్తోంది. ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటూ, ప్రకృతి విపత్తులను అధిగమిస్తూ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది. విద్య, వైద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో వడివడిగా ముందుకు సాగుతోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవాన.. జిల్లా ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధి ఏమిటి..? ఇంకా సాధించాల్సిన ప్రగతి ఏమిటో పరిశీలిద్దాం..
మత్స్య సంపదకు కొదవే లేదు..
సువిశాల సముద్ర తీర ప్రాంతం జిల్లా సొంతం. ఎన్నో అరుదైన జలచరాలు లభ్యమవుతున్నాయి. మత్స్య సంపదకు కొదవే లేదు. 104 గ్రామాలకు చెందిన 1.12 లక్షల మంది మత్స్యకారులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు 2,500 హెక్టార్లలో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. వీటి పెంపకానికి జిల్లాలోని తీరప్రాంతం అనుకూలం. గత కొన్నేళ్లుగా వీటి సాగు క్రమంగా పెరుగుతోంది.
ఇవి సాధిస్తే అభివృద్ధి పరుగే
2.13 లక్షల హెక్టార్లలో..
సిక్కోలు పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఖరీఫ్లో 2.13 లక్షల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, చెరకు పంటలు ఇక్కడి ప్రత్యేకం. నీటి వనరులు అభివృద్ధి చెందడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
పేదరికం, నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడిన జిల్లా నేడు అక్షరాస్యతలో దూసుకుపోతోంది. చదువు విలువ తెలుసుకుని తమ పిల్లలను ఉన్నత విద్య చెప్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంజినీరింగ్, వైద్య, ఐఐటీ చదువుల్లోనూ రాణిస్తున్నారు.
రహదారుల పొడవు (కిలోమీటర్లలో)
స్వాతంత్య్రం తర్వాత రహదారుల విస్తరణలో పురోగతి ఉంది. జిల్లా మీదుగా వెళ్లే ఎన్హెచ్-16 ఆరు వరుసలుగా రూపాంతరం చెందడంతో రవాణా సులభతరమైంది. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, గ్రామీణ దారులు మెరుగుపడ్డాయి.
మన దగ్గరే విశ్వవిద్య..
ఎచ్చెర్ల వద్ద ఉన్న ఏయూ స్టడీసెంటర్ నేడు అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మారింది. దీంతో జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకొచ్చింది. దీనికి అనుబంధంగా జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలలు ఏర్పడ్డాయి.
కొబ్బరి అంటే ఉద్దానం..
కోనసీˆమ తర్వాత కొబ్బరి ఎక్కువగా పండించేది ఉద్దానంలోనే. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఉద్యానవనంగా పిలిచేవారు. ఇక్కడ పండించే కొబ్బరి పంట రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రాలకూ ఎగుమతి అవుతోంది. దాదాపు 25 వేల ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతోంది.
రుచిలో మేటి పలాస జీడిపప్పు
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలు జీడి పంటకు పెట్టింది పేరు. పలాస జీడిపప్పుకి దేశ వ్యాప్తంగా పేరు ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. 40,500 ఎకరాల్లో జీడి పంట సాగవుతోంది. విలువ ఆధారిత ఉత్పత్తులు ఇక్కడే తయారయ్యేలా చేయగలిగితే జిల్లా అభివృద్ధిలో ఇది కీలకంగా మారుతుంది.
నాణ్యమైన వైద్యమే కీలకం..
గతంతో పోల్చితే వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నో సంస్కరణలు వస్తున్నాయి. గ్రామంలోనే మెరుగైన వైద్య సేవలు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అవసరమైన వైద్యం కోసం పేదవాడు వెళ్లాల్సిన దూరం క్రమంగా తగ్గుతోంది. అదే క్రమంలో నాణ్యమైన వైద్యం కూడా అందాలి. అవసరమైన అన్ని సదుపాయాలు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి.
- కె.సి.చంద్రనాయక్, విశ్రాంత జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
ఇతర దేశాల్లో ప్రభుత్వ విద్యపైనే ఆధారపడే వారు ఎక్కువ. అక్కడే నాణ్యమైన విద్య అందుతుంది. మన దగ్గరా ఆ విధానం రావాలి. గతం కంటే ఇప్పుడు నిధులు ఖర్చు చేస్తున్నారు. వృత్తి విద్య కూడా అదేస్థాయిలో అందుబాటులో ఉండాలి. డిమాండ్, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విద్యా విధానాల్లో మార్పులు తేవాలి.
- బలివాడ మల్లేశ్వరరావు, విశ్రాంత డీఈవో
పెండింగ్ ప్రాజెక్టులు పట్టాలెక్కితే బాగు..
దాదాపు రూ.2 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన వంశధార రిజర్వాయర్, నేరడి బ్యారేజీ కల నెరవేరితే జిల్లా సస్యశ్యామలమే. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన జిల్లాలో అన్ని మూలలకూ నీరందించే అవకాశముంది. పెండింగ్ ప్రాజెక్టులు వినియోగంలోకొస్తే పంటకాలం ఆలస్యాన్ని నివారించవచ్చు. దిగుబడులు పెంచొచ్చు.
- డోల తిరుమలరావు, వంశధార ఎస్ఈ
యువత వ్యవసాయం వైపు అడుగేయాలి
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతోంది. వాటిని వినియోగించాలంటే యువతకే సాధ్యం. ఇప్పటికే ఈ రంగంలోని యువత బయటకెళ్లకుండా చూడాలి. భూమి లేకపోయినా పండించే విధానాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అవి మరింత వృద్ధి చెందుతాయి. పంట చేతికొచ్చిన తర్వాత రైతులే నేరుగా మార్కెటింగ్ చేసుకునేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.
- డాక్టర్ కె.చిన్నంనాయుడు, ప్రొఫెసర్, నైరా వ్యవసాయ కళాశాల
ఔత్సాహికులకు ప్రోత్సాహం..
పరిశ్రమలు నెలకొల్పడమంటే ఉపాధి దొరికినట్లే. అలాంటి పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలి. యువత ఉద్యోగాల వైపు కాక నైపుణ్యాలు అలవర్చుకుని పారిశ్రామిక రంగం వైపు మొగ్గు చూపాలి. చిన్న కారణాలతో మూతపడిన పరిశ్రమలు మళ్లీ తెరుచుకునేలా చేయాలి. జిల్లాలోని వనరుల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహమివ్వాలి.
- తాళ్లూరి రామ్మోహన్రావు, ఐలా ఎక్స్ ఛైర్మన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్