డబ్బుల కోసమే కిడ్నాప్..!
జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన వైద్యుడు గూడేన సోమేశ్వరరావు కిడ్నాప్ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న పరమేశ్ తెలిపిన వివరాల ఆధారంగా మరో ఇద్దరు అనుమానితులను శ్రీకాకుళం నగరంలోనే పట్టుకున్నట్లు సమాచారం. వారిని ప్రస్తుతం పోలీసుస్టేషన్లో ఉంచి విచారిస్తున్నట్లు తెలిసింది.
శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన వైద్యుడు గూడేన సోమేశ్వరరావు కిడ్నాప్ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న పరమేశ్ తెలిపిన వివరాల ఆధారంగా మరో ఇద్దరు అనుమానితులను శ్రీకాకుళం నగరంలోనే పట్టుకున్నట్లు సమాచారం. వారిని ప్రస్తుతం పోలీసుస్టేషన్లో ఉంచి విచారిస్తున్నట్లు తెలిసింది. నగరానికి చెందిన ఇద్దరు, విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ముగ్గురు తెలిపిన వివరాలతో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. కిడ్నాప్లో పాల్గొన్న మరో వ్యక్తి రాజు కోసం విశాఖలో తీవ్రంగా గాలిస్తున్నారు.
రాజు దొరికితేనే...
ఆ నలుగురు డబ్బుల కోసమే వైద్యుడు సోమేశ్వరరావును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుడి గురించి పూర్తి సమాచారం తెలిసిన, ఆయన ఇంటి సమీపంలోనే పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రధాన సూత్రధారికి అన్ని వివరాలు తెలిపినట్లు విచారణలో బయటపడినట్లు తెలిసింది. ప్రధాన సూత్రధారి గతంలోనూ వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలామంది వద్ద రూ.లక్షల్లో గుంజేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈయన వినియోగిస్తున్న కారుకు సంబంధించిన పత్రాలూ కూడా సక్రమంగా లేవు. అయితే విశాఖపట్నానికి చెందిన రాజు ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కేసు కొలిక్కి రావట్లేదు. ఇతను దొరికితే కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు