మరో ఝాన్సీ.. మన గున్నమ్మ
అవును.. నాటి ఝాన్సీ లక్ష్మీభాయి.. బిడ్డను వీపున కట్టుకుని తెల్లవారిపై పోరాటం చేస్తే.. మన వీరనారి గున్నమ్మ నిండు గర్భిణిగా తెల్లవారి తొత్తులైన పోలీసులను ఎదిరించింది. వారు ఓ వైపు కాల్పులకు దిగుతున్నా వెనుకంజ వేయలేదు. తూటాలకు నేలకొరిగినా.. ఎందరికో స్ఫూర్తిగా ఆకాశాన నిలిచారు.
మందస, న్యూస్టుడే
గున్నమ్మ ఊహా చిత్రం
అవును.. నాటి ఝాన్సీ లక్ష్మీభాయి.. బిడ్డను వీపున కట్టుకుని తెల్లవారిపై పోరాటం చేస్తే.. మన వీరనారి గున్నమ్మ నిండు గర్భిణిగా తెల్లవారి తొత్తులైన పోలీసులను ఎదిరించింది. వారు ఓ వైపు కాల్పులకు దిగుతున్నా వెనుకంజ వేయలేదు. తూటాలకు నేలకొరిగినా.. ఎందరికో స్ఫూర్తిగా ఆకాశాన నిలిచారు. ఈ నేల గర్వపడేలా చేశారు. గుడారిరాజమణిపురాన్ని వీరగున్నమ్మపురంగా సిక్కోలు పోరుగడ్డగా ప్రఖ్యాతి గాంచేలా చేసిన వీరనారి మన గున్నమ్మ.
పోరాటమే శరణ్యమని..: అది 1940 ప్రాంతం.. తెల్లదొరల పాలన నడుస్తున్న రోజులవి. రైతులు తాము పండించిన పంటలో మూడొంతులు జమిందారులకు శిస్తు కట్టేవారు. మిగిలినవి సాలుసరి తిండికి చాలక నానాబాధలూ పడేవారు. ఈ దుర్భర పరిస్థితులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం గుడారిరాజమణిపురం ప్రజలను ఎంతగానో ఆలోచింపజేసింది. జమిందారుల పీడ నుంచి విముక్తి పొందాలంటే పోరాటాలే శరణ్యమని భావించారు. రైతులంతా ఏకమయ్యారు.
పన్ను చెల్లించకూడదని నిర్ణయించి.. : మందస ఎస్టేటు పరిధిలోని అడవుల నుంచి నాటుబళ్లపై కలప తెచ్చుకునేందుకు అంతా సన్నద్ధమయ్యారు. తెచ్చిన కలపకు ఏ పరిస్థితుల్లోనూ పన్ను చెల్లించకూడదని నిర్ణయించారు. అనుకున్నట్లుగా అడవుల నుంచి నాటుబళ్లపై కట్టెలు (వంట చెరకు)తో గ్రామానికి చేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాటి మందస ఎస్టేటు దివాను రామకృష్ణదేవ్ విషయాన్ని సర్కారుకు చేరవేశారు. వెంటనే డీఎస్పీ మునిలాల్ పోలీసు బలగాలతో గ్రామానికి వెళ్లి కొందరిని అరెస్టు చేశారు. రైతులు ఆగ్రహానికి గురై తిరగబడ్డారు. అరెస్టయినవారిని విడిపించుకున్నారు.
హూంకరించి..
సబ్కలెక్టరు చక్రవర్తి అదనపు పోలీసు బలగాలతో 1940 ఏప్రిల్ 1న గ్రామానికి వచ్చారు. చర్చల పేరుతో రైతులను తీసుకెళ్తుండగా వారిని అరెస్టు చేసేందుకేనని భావించి సాసుమాన గున్నమ్మ అపర కాళిలా పోలీసులపై హూంకరించారు. ఆమె స్ఫూర్తితో రైతులు కర్రలతో ఎదురుదాడికి దిగారు. బెదరగొట్టేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ఎవరూ వెనుకంజవేయలేదు. ముందుకే సాగిన నిండు గర్భిణి గున్నమ్మ నేలకొరిగి వీర మరణం పొందింది. ఆమెతో పాటు సమీప గ్రామానికి చెందిన గొర్లె జగ్గయ్య, గుంట బుడియాడు, కర్రి కలియాడు, గుంట చిననారాయణ కూడా వీరమరణం పొందారు.
స్మారకంగా..
గ్రామాన్ని 1988లో గవర్నరు శ్రీమతి కముద్బెన్జోషి సందర్శించారు. గున్నమ్మ నేలకొరిగిన చోట ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి వీరగున్నమ్మపురంగా నామకరణం చేసి ప్రభుత్వ గెజిట్లో మార్పు చేయించారు. ఈమె త్యాగానికి స్మృతిగా గ్రామానికి వెళ్లే దారిలో పోరాట చిహ్నాలతో సింహద్వారాన్ని ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ