వంశధార ఉగ్రరూపం
వంశధార ఆదివారం రాత్రి 12 గంటల సమయానికి 73 వేల క్యూసెక్కుల అవుట్ఫ్లోతో ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం 6 గంటలకు గొట్టాబ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 30,387 క్యూసెక్కులు నమోదైంది. దీంతో 11 గేట్లు ఎత్తివేసి అధికారులు
వంశధార నది నుంచి గొట్టాబ్యారేజీ వద్ద దిగువకు వెళ్తున్న నీరు
ప్రజలను అప్రమత్తం చేయండి: కలెక్టర్
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ తెలిపారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాల కారణంగా నదుల్లో వరద నీరు రానుందని, వెంటనే తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం మండల అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే వంశధార నదిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వివరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కొత్తూరు, భామిని, హిరమండలం, ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి, పోలాకి, ఆమదాలవలస, జలుమూరు, నరసన్నపేట మండల తహసీల్దార్లు వారి పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో జేసీ ఎం.విజయసునీత, ఎస్పీ జి.ఆర్.రాధిక పాల్గొన్నారు.
సగటు వర్షపాతం 15.9 మి.మీ.
ఆదివారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 15.9 మి.మీ.లుగా నమోదైంది. పలాసలో 47.4, మెళియాపుట్టి 31.4, ఇచ్ఛాపురం 29.8, వజ్రపుకొత్తూరు 29.6, కంచిలి 28.8, కవిటి 28.6, ఎల్.ఎన్.పేట 26, సోంపేట 24.2, సారవకోట 22.4 మిల్లీమీటర్లు చొప్పున వర్షం కురవగా.. మిగిలిన చోట్ల ఓ మోస్తరుగా పడింది.
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబరు 9491222122
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటల మామ.. సంక్షేమం మమ..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని పిల్లలందరికీ తనకు తాను మేనమామగా ప్రకటించుకున్న సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను ఎంతో ఉద్ధరించినట్లు గొప్పలు చెబుతారు. -
ఉసురు తీసిన అక్రమ తవ్వకాలు
[ 20-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఇసుక పెళ్లలు పడి ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. -
రెండో రోజు.. ప్రధాన పార్టీల జోరు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వంలో రెండో రోజు సందడిగా సాగింది. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థులు బోణీ చేయగా.. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
నామినేషన్ల కోలాహలం
[ 20-04-2024]
ప్రధాన పార్టీల అభ్యర్థులు శుక్రవారం టెక్కలి, పాతపట్నంలో నామినేషన్లు వేశారు. పాతపట్నంలో కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమానికి కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 20-04-2024]
బాలికలు, మహిళలు సొంత కాళ్లపై నిల్చొని ఉపాధి పొందేందుకు తగిన సహకారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం దశాబ్దాల క్రితం శిక్షణ కేంద్రాలను జిల్లాకు ఓ చోట ఏర్పాటు చేసింది. -
పర్యాటక కేంద్రంగా భావనపాడు: అచ్చెన్న
[ 20-04-2024]
రానున్న రోజుల్లో సంతబొమ్మాళి మండలం భావనపాడును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 20-04-2024]
లావేరు మండలం పెద్దలింగాలవలస సర్పంచి ప్రతినిధి, లుకలాపు అప్పలనాయుడు, ఇతర నేతలు శుక్రవారం భాజపాలో చేరారు. -
వైకాపాకు డోల జగన్ రాజీనామా
[ 20-04-2024]
రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ సఫలం కాలేకపోయిందని డీసీసీబీ మాజీ ఛైర్మన్ డోల జగన్ ఆరోపించారు. -
ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మహిళ మృత్యువాత
[ 20-04-2024]
మండలంలోని పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజినీ (48) ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
నిరాడంబరంగా గౌతు శిరీష నామినేషన్
[ 20-04-2024]
పలాస నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ రెండోరోజు కూటమి అభ్యర్థి గౌతు శిరీష నిరాడంబరంగా వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్ బాబు ర్యాలీగా వచ్చి దాఖలు చేశారు. -
పట్టణంలోనే ఉన్నా.. నిత్యం నరకమే
[ 20-04-2024]
కాలువలు ఉండవు, మట్టి రోడ్లే గతి, విద్యుత్తు దీపాలు కనిపించవు, తాగునీరు సేకరణకు అవస్థలు తప్పవు ఇదీ ఎస్టీ రిజర్వేషన్ పొందిన 4వ వార్డు దుస్థితి. వాస్తవంగా పురపాలకసంఘ బడ్జెట్లోనూ ఎస్సీ, ఎస్టీ వార్డులకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?